ఈ రోజు విశేషం
2009 జానపద చిత్రాల కథానాయకుడు 'కత్తుల' కాంతారావు క్యాన్సర్ వ్యాధితో హైదరాబాదు యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు.
తెలుగు నాట ఈ రోజు
- 2009 జానపద చిత్రాల కథానాయకుడు 'కత్తుల' కాంతారావు క్యాన్సర్ వ్యాధితో హైదరాబాదు యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1739 నాదిర్షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనాన్ని అపహరించాడు. భారత్
- 1946 బ్రిటిష్ పరిపాలనలో గల జోర్డాన్కు స్వాతంత్ర్యం లభించింది. భారత్
- 1957 భారత ప్రభుత్వం శకసంవత్సరాన్ని జాతీయ సంవత్సరంగా స్వీకరించింది.ఈ క్యాలెండర్ 365 రోజులు, 12 నెలలను కలిగి, మార్చి 22న ప్రారంభమవుతుంది, ఇది లీపు సంవత్సరంలో మార్చి 21కి అనుగుణంగా ఉంటుంది. భారత్
- 1960 ఆర్థర్ లియొనార్డ్, డా.చార్లెస్.టౌన్స్ లు లేజర్ పై మొదటి పేటెంట్ హక్కులు పొందారు.
- 1971 భారత లోక్ సభ స్పీకర్గా గుర్దయాళ్ సింగ్ థిల్లాన్ పదవి స్వీకారం. భారత్
- 1982 నాసా యొక్క స్పేస్ షటిల్ "కొలంబియా" కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగింపబదినది.
- 2000 భారత కృత్రిక ఉపగ్రహం ఇన్సాట్-3బి ప్రయోగం విజయవంతం. భారత్
- 2020 కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించారు. భారత్ పూర్తి ప్రస్థానం →
- 2020 కరోనా వ్యాప్తి నివారణకు దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పాటించారు. భారత్ పూర్తి ప్రస్థానం →
జననాలు
- 1828 అమరావతి శేషయ్య శాస్త్ర్రి, ఎండోమెంటు డిప్యూటీ కలెక్టరుగా రెండున్నర లక్షల ఒరిజనల్ క్లైమ్సు పత్రాలను పరిశీలించి అనేక వేలఎండోమెంటు క్లైమ్సులు పరిష్కరించాడు. (మ.1903).
- 1868 అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్ (మరణం1953).
- 1900 యజ్ఞనారాయణ శాస్త్రి, తెలుగు రచయిత, కవి, శతావధానులు.
- 1907 టేకుమళ్ల కామేశ్వరరావు, విమర్శకుడు.జానపద వాజ్మయం లోనూ, బాల వాజ్మయం లోనూ ఎక్కువగా కృషి చేశాడు. పాత పాటలు జోల పాటలు సేకరించి ప్రచురించాడు.
- 1920 కట్సుకో సరుహషి జపాన్ దేశానికి చెందిన భూరసాయన శాస్త్రవేత్త. (మ.2007).
- 1945 శీల రవిచంద్రన్, కేరళ కు చెందిన నటి,దర్శకురాలు, రచయిత్రి,పలు తెలుగు చిత్రాల నటి.
- 1947 ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020).
మరణాలు
- 1832 గేథే, జర్మనీ రచయిత. (జ.1749).
- 1868 అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాబర్ట్ మిల్లికాన్. (మరణం1953).
- 2005 జెమినీ గణేశన్, తమిళ నటుడు. (మ.2005). భారత్
- 2007 ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి, తత్వవేత్త. (జ.1918).
- 2009 టి.ఎల్. కాంతారావు, తెలుగు సినిమా నటుడు. (జ.1923).
- 2016 మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) వ్యవస్థాపక అధ్యక్షుడు. (జ.1939).
సినిమా
- 1967 'కంచుకోట' చిత్రం విడుదలైంది.
- 2023 'రంగమార్తాండ' చిత్రం విడుదలైంది.
- 2024 'ఓం భీమ్ బుష్' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ జల దినోత్సవం.