ఈ రోజు విశేషం
1954 మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
సంఘటనలు
- 1910 ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.
- 1954 మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.
జననాలు
- 1856 రాబర్ట్ పియరీ, ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలివ్యక్తి (మ.1920).
- 1861 మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు (మ.1931). భారత్
- 1868 రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి (మ.1918).
- 1932 మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996).
- 1953 టోని బ్లెయిర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి. భారత్
- 1965 హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.
మరణాలు
- 1910 ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి (జ.1841).
- 1962 మొక్కపాటి కృష్ణమూర్తి చిత్రకారుడు, శిల్పి, రచయిత. (జ.1910).
- 1971 పింగళి నాగేంద్రరావు, తెలుగు చలన చిత్ర రచయిత (జ.1901).
- 1976 కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి (జ.1902).
- 2006 తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత (జ. 1919).
- 2006 బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత (జ.1927).
- 2021 జీ.ఆనంద్, నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు (జ.1957).
సినిమా
- 1966 'శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ' చిత్రం విడుదలైంది.
- 2022 'భళా తందనానా' చిత్రం విడుదలైంది.
- 2022 'జయమ్మ పంచాయితీ' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం.
- అంతర్జాతీయ డైట్ రహిత దినం.