ఈ రోజు విశేషం
2014 తెలుగు సంస్కృతికి తన గీతతో రూపమిచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు.
తెలుగు నాట ఈ రోజు
- 2014 తెలుగు సంస్కృతికి తన గీతతో రూపమిచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి బాపు చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1857 భారత స్వాతంత్ర్యోద్యమము: ఢిల్లీ ఆక్రమణ జూలై 1న ప్రారంభమై ఆగస్టు 31 న పూర్తయింది. ఈ యుద్ధంలో ఒకవారంపాటు అడుగడుగునా వీధిపోరాటం జరిగింది. భారత్
జననాలు
- 1864 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (మ.1945).
- 1903 కన్హయ్య లాల్ మిశ్రా భారతీయ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్. (మ.1975). భారత్
- 1923 చెన్నమనేని రాజేశ్వరరావు, విద్యార్థి దశలోనే జాతీయోద్యమంలోనూ, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ పాల్గొన్నారు (మ.2016).
- 1925 ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు (మ.1998).
- 1932 రావిపల్లి నారాయణరావు, 80 కథలు రాశారు. 'పెళ్ళాడి ప్రేమించు' అనే కథా సంపుటి తెలుగు వారికందించారు.
- 1934 రాజశ్రీ, సినిమా పాటల రచయిత. (మ.1994).
- 1936 తురగా జానకీరాణి, రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశారు. (మ.2014).
- 1944 వెస్ట్ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు క్లైవ్ లాయిడ్ జననం.
- 1949 అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం.
- 1960 హసన్ నస్రల్లా, లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ నాయకుడు.
- 1962 మల్లిపూడి మంగపతి పళ్ళంరాజు, 14వ లోక్సభ సభ్యుడు. భారత్
- 1969 జవగళ్ శ్రీనాథ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. భారత్
- 1975 ఉడతా రామకృష్ణ, సదా మీకోసం పత్రిక సంపాదకులు జననం.
- 1979 యువన్ శంకర్ రాజా, తమిళ, తెలుగు చిత్రాల సంగీత దర్శకుడు.
మరణాలు
- 1984 పెండ్యాల నాగేశ్వరరావు, సంగీత దర్శకుడు (జ .1917).
- 1997 ప్రిన్సెస్ డయానా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య (జ.1961).
- 2014 బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు (జ.1933).
సినిమా
- 1967 'స్త్రీ జన్మ' చిత్రం విడుదలైంది.
- 1979 'Niram Maaratha Pookkal' చిత్రం విడుదలైంది.
- 2018 'పేపర్ బాయ్' చిత్రం విడుదలైంది.