జనవరి 5 ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ తొలిసారి పోటీచేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి.
జనవరి 7 శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 199 స్థానాలు గెలిచి కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరదించింది.
జనవరి 9 ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
జనవరి 19 గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నూమౌస్నూ కలిగి ఉన్న తొలి పర్సనల్ కంప్యూటర్ 'ఆపిల్ లిసా'ను ఆపిల్ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది.
ఫిబ్రవరి 14 శతాబ్దపు హాస్యనటుడిగా పేరొందిన రాజబాబు మరణించారు.
ఫిబ్రవరి 24 డౌ జోన్స్ ఇండిస్ట్రియల్ ఏవరేజి 1100 మార్క్ ని మొదటిసారిగా దాటింది. ఈ రోజున 24.87 పాయింట్లు పెరిగింది. 1972 లో, 1100 మార్క్ చేరినా, ఈ మార్క్ చివరి వరకు నిలబడలేదు.
మార్చి 13 హైదరాబాదులో సితార అవార్డుల ఉత్సవంలో ఎల్.వి.ప్రసాద్కు 'కళాతపస్వి' బిరుదు ప్రదానం జరిగింది.
మార్చి 22 పుట్టపర్తి నారాయణాచార్యుల సతీమణి, సంస్కృతాంధ్ర కవయిత్రి పుట్టపర్తి కనకమ్మ కన్నుమూశారు.
మే 10 అమెరికా సంయుక్త దళాలు గ్రెనడా పై దాడి చేసాయి.
మే 20 తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ నందమూరి హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించారు.
జూన్ 15 మహాప్రస్థానం కావ్యంతో తెలుగు కవిత్వ గతిని మార్చిన మహాకవి శ్రీశ్రీ కన్నుమూశారు.
జూన్ 18 ప్రపంచకప్ క్రికెట్ లో కపిల్ దేవ్ జింబాబ్వే పై 175 పరుగులు సాధించి ఒకరోజు క్రికెట్లో భారత్ తరపున తొలి శతకాన్ని నమోదుచేశాడు.
భారత్
జూన్ 18 మొదటి అమెరికా రోదసీ యాత్రికురాలు సాల్లీ రైడ్ (ఎస్.టి.ఎస్-7).
జూన్ 25 భారత్ మొట్టమొదటి సారిగా క్రికెట్లో ప్రపంచ కప్ (ప్రుడెన్షియల్ వరల్డ్ కప్) ను గెలుచుకుంది.
భారత్
జూలై 16 యూరి ఆండ్రొపోవ్ యు.ఎస్.ఎస్.ఆర్ (రష్యా) అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు.
జూలై 21 పోలిష్ ప్రభుత్వం 19 నెలల మార్షల్ లాని ఎత్తివేసింది.
జూలై 21 ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషను, అంటార్క్టికా ఖండంలో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది.
జూలై 22 డిక్ స్మిత్ హెలికాప్టర్ మీద ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొదటి వ్యక్తి.
ఆగస్టు 1 జనరల్ ఎ.ఎస్.వైద్య భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
ఆగస్టు 4 ఇటలీ 1946 తరువాత, మొదటి సామ్యవాద ప్రధాన మంత్రిని ఎన్నుకుంది.
ఆగస్టు 15 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా రామ్ లాల్ నియమితులయ్యాడు.
అక్టోబరు 19 ప్రొ.సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ తన 73వ పుట్టినరోజునాడు ఫిజిక్స్ నోబెల్ పురస్కారానికి ప్రొ.విలియం ఫౌలర్ తో కలిసి ఎంపికయ్యాడు.
అక్టోబరు 19 ముంబైలో 13 జౌళి పరిశ్రమ లను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి పరిశ్రమల సమ్మె ముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్ నాయకత్వం వహించాడు.
భారత్
అక్టోబరు 28 ఖైదీ చిత్రం ఘనవిజయం సాధించి చిరంజీవికి స్టార్డం తెచ్చిపెట్టింది.
నవంబరు 1 ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త వ్యవస్థ ఏర్పాటయింది. మొదటి లోకాయుక్తగా ఆవుల సాంబశివ రావు నియమితులయ్యారు.
నవంబరు 1 టంగుటూరి ప్రకాశం జీవితం ఆధారంగా ఆంధ్ర కేసరి చిత్రం విడుదలైంది.