జనవరి 28 ముస్లిముల ప్రత్యేక దేశానికి పాకిస్తాన్ అనే పేరుపెట్టాలని ప్రతిపాదించారు. పాకిస్తాన్ అంటే స్వచ్ఛమైన భూమి అని అర్థం.
ఫిబ్రవరి 27 హిట్లరు నియంతృత్వ పాలనకు దారితీసిన జర్మనీ పార్లమెంటు భవన దహనం జరిగింది.
భారత్
మే 10 నాజీలు జర్మనీలో బహిరంగంగా పెద్ద ఎత్తున పుస్తకాలను తగులబెట్టారు.
మే 18 టెన్నెసీ వేలీ అథారిటీ (టి.వి.ఏ) ని ఏర్పాటు చేసారు., దీని ఉద్దేశాలు.. టెన్నేస్సీ నది వలన వచ్చే వరదలను కట్టడి చేయటానికి, టెన్నెస్సీ లోయ లోని భూములలో అడవులను పెంచటము, గ్రామాలకు విద్యుత్తును అందించటము. టెన్నెసీ వేలీ అథారిటీ ఏడు రాష్ట్రాలలో పనిచేస్తుంది.
జూలై 22 విలీ పోస్ట్ ఒంటరిగా 15,596 మైళ్ళు 7 రోజుల 18 గంటల 45 నిమిషాలలో విమానంలో ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి.
సెప్టెంబరు 4 మొదటిసారిగా విమానం గంటకి 300 మైళ్ళ (483 కి.మీ) వేగాన్ని దాటి ప్రయాణించింది పైలట్లు జె.ఆర్.వెండెల్, గ్లెన్వ్యూ Il.
అక్టోబరు 17 నాజీ ల దురాగతాలు భరించలేక మాతృభూమి (జర్మనీ) ని వదిలి ఐన్స్టీన్ అమెరికాకు పయనం.
డిసెంబరు 8 నటుడు రేలంగి వెంకట్రామయ్యకు పెంటపాడుకు చెందిన బుచ్చియమ్మతో వధువు స్వగృహంలో వివాహం జరిగింది.
డిసెంబరు 15 ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు (సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ) పశ్చిమ గోదావరి జిల్లా కంతేరులో జన్మించారు.
జననాలు
జనవరి 23 భీమ్ సింఘాల్, ప్రముఖ న్యూరాలజిస్టు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
ఫిబ్రవరి 1 వెల్చేరు నారాయణరావు, తెలుగు సాహిత్య విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు, పండితుడు.
మార్చి 2 ఆనంద్ జీ విర్జీ షా భారతీయ సంగీత దర్శకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
భారత్
మార్చి 6 కృష్ణకుమారి, తెలుగు చలనచిత్ర నటి.(మ.2018).
మార్చి 18 దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.
మార్చి 21 నటరాజ రామకృష్ణ, పేరిణి శివతాండవము, నవజనార్దనం వంటి ప్రాచీన నాట్యరీతుల్ని తిరిగి వెలుగులోకి తెచ్చిన నాట్యాచార్యుడు (మ.2011).
మార్చి 25 వసంత్ గోవారికర్, భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ, పద్మభూషణ అవార్డుల గ్రహీత. (మ.2015).
భారత్
అక్టోబరు 10 సదాశివ పాటిల్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
భారత్
అక్టోబరు 15 పి.చంద్రశేఖర్ రెడ్డి , తెలుగు చలనచిత్ర, దర్శకుడు (2022).
అక్టోబరు 24 చామర్తి కనకయ్య, కనక్ ప్రవాసి అనే కలం పేరుతో తెలుగు సాహిత్య లోకానికి సుపరిచితుడు. (మ.2010).
నవంబరు 3 అమర్త్యా సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త.
భారత్
నవంబరు 22 నీరుకొండ హనుమంతరావు, ఖమ్మం జిల్లాకు చెందిన కవి. (మ.2016).
డిసెంబరు 15 వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (మ.2007).
డిసెంబరు 15 బాపు, చిత్రకారుడు, సినీ దర్శకుడు. (జ.2014).
డిసెంబరు 23 శిరోమణి సహవాసి, ఈనాడు దినపత్రికలో ఉద్యోగిగా చేరాడు. 1984లో సహాయక వార్తా సంపాదకునిగా పనిచేశాడు.
డిసెంబరు 25 పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ "తెలుగు - ఉర్దూ నిఘంటువు" ప్రాజెక్టుకు డైరెక్టర్గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.
డిసెంబరు 28 రాచెల్ అంకోమా, అక్రా మెజెస్టిక్స్ స్పోర్ట్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు.
మరణాలు
మార్చి 28 గుత్తి కేశవపిళ్లె, భారతీయ పాత్రికేయుడు, రాజకీయవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1860).
భారత్
ఏప్రిల్ 2 మహారాజా రంజిత్ సింహ్జీ, క్రికెట్ ఆటగాడు. ఈయన పేరిటే భారత్లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు. (జ.1872).
భారత్
ఏప్రిల్ 22 సర్ హెన్రీ రోయ్స్, కార్ల నిర్మాణదారుడు.
జూన్ 10 బసవరాజు అప్పారావు, కవి,సంపాదకుడు, న్యాయవాది,(జ.1894).
సెప్టెంబరు 20 అనీ బెసెంట్, హోంరూల్ ఉద్యమ నేత. (జ.1847).
సెప్టెంబరు 27 కామిని రాయ్, బెంగాలీ కవియత్రి, సామాజిక కార్యకర్త ఇంకా బ్రిటిష్ భారతదేశపు స్త్రీవాది. (జ.1864).
భారత్
డిసెంబరు 27 కాకర్ల శ్రీరాములు, మహిళల విద్యాభివృద్ధికి కృషిచేసిన వ్యక్తి.