జనవరి 11 మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.
ఫిబ్రవరి 11 సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెస్ సమావేశం నిర్ణయించింది.
ఫిబ్రవరి 22 పుల్లరి సత్యాగ్రహ నాయకుడు కన్నెగంటి హనుమంతు బ్రిటిషు ప్రభుత్వ పోలీసు కాల్పుల్లో మరణించాడు.
భారత్
మార్చి 10 స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మాగాంధీ రాజా ద్రోహం కింద అరెస్టయ్యారు.
భారత్
మార్చి 18 మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
భారత్
మే 4 జలగం వెంగళరావు శ్రీకాకుళం జిల్లా సోపేరు గ్రామంలో జన్మించారు.
మే 24 నెదర్లాండ్స్లో 1922 'మే' నెలలో చాలా ఎక్కువ వేడి (అత్యధిక ఉష్ణోగ్రత) నమోదైంది (35.6 °C సెంటిగ్రేడ్).
జూన్ 29 ఆస్టరాయిడ్ # 979 (పేరు 'ఇల్సెవా') ని కె. రీన్ ముత్ కనుగొన్నాడు.
ఆగస్టు 22 అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి జరిగింది.
ఆగస్టు 22 అల్లూరి సీతారామరాజు 300 మంది వీరులతో చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో మన్యం విప్లవం ఆరంభమైంది.
ఆగస్టు 24 అల్లూరి దళం రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్పై దాడి చేసి బందీగా ఉన్న వీరయ్యదొరను విడిపించింది.
ఆగస్టు 30 గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యమును దుమ్లుపినార్ యుద్ధము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్ధము )అని కూడా అంటారు.
భారత్
సెప్టెంబరు 24 అల్లూరి సీతారామరాజు దళం గెరిల్లా దాడిలో బ్రిటిష్ అధికారులు కవార్డ్, హైటర్ హతమయ్యారు.
అక్టోబరు 1 హాస్యనటుడు అల్లు రామలింగయ్య పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు.
అక్టోబరు 18 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ' (బీబీసీ) ప్రారంభం. కాలక్రమంలో అది 'బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్'గా మారింది.
భారత్
డిసెంబరు 4 గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటపల్లి గ్రామంలో జన్మించారు.
డిసెంబరు 6 పెదగడ్డపాలెం పోరులో అల్లూరి దళానికి తొలి ఎదురుదెబ్బ తగిలి 12 మంది విప్లవవీరులు అమరులయ్యారు.
డిసెంబరు 30 రష్యన్ సోవియట్ ఫెడరేషన్, ట్రాన్స్కకేషియన్, ఉక్రేనియన్, బెలారసియన్ సోవియట్ రిపబ్లిక్లు నాలుగూ కలిసి ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడ్డాయి.
నవంబరు 28 ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (మ.1983).
నవంబరు 28 కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2003).
భారత్
డిసెంబరు 4 ఘంటసాల వెంకటేశ్వరరావు, తెలుగు సినిమా సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు. (మ.1974).
డిసెంబరు 11 దిలీప్ కుమార్, భారతీయ చలనచిత్ర నటుడు,నిర్మాత,దర్శకుడు,రాజకీయ నాయకుడు.
భారత్
డిసెంబరు 16 కుందుర్తి ఆంజనేయులు, వచన కవితా పితామహుడు అనే బిరుదాంకితుడై, ఆంధ్ర దేశములో వచన కవితా ఉద్యమానికి ఆద్యుడు (మ.1982).
డిసెంబరు 23 ఘండికోట బ్రహ్మాజీరావు, ఉత్తరాంధ్ర రచయిత, సాహితీ వేత్త. (మ.2012).
మరణాలు
ఫిబ్రవరి 2 కోపల్లె హనుమంతరావు, జాతీయ విద్యకై విశేష కృషిన వారు. (జ.1880).
ఫిబ్రవరి 22 కన్నెగంటి హనుమంతు, పుల్లరి సత్యాగ్రహ నాయకుడు.
ఏప్రిల్ 1 హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (జ.1884).
మే 12 మాస్టర్ సి.వి.వి., భారతీయ తత్త్వవేత్త, యోగి, గురువు.(జ.1868).
భారత్
జూన్ 13 నానక్ భిల్, సహాయ నిరాకరణోద్యమంలో ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర్య వీరుడు. (జ.1890).
భారత్
సెప్టెంబరు 17 ముత్తరాజు సుబ్బారావు, శ్రీకృష్ణ తులాభారం నాటక రచన ద్వారా ప్రసిద్ధులయ్యారు, ఇతర రచనలు ఉత్తర రామచరిత్ర, రాజ్యశ్రీ, చంద్రగుప్త. వీటిలో రాజ్యశ్రీ నాటకాన్ని చెన్నపురిలోని సుగుణవిలాస సభవారు ఏర్పరచిన పోటీలకు రాసింది (జ.1888).