ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 26 లాహోర్ కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తొలి సంపూర్ణ స్వరాజ్య దినాన్ని పాటించారు. భారత్
  • జనవరి 31 శాసనోల్లంఘనకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టాల్సిన 11 కనీస చర్యలను గాంధీ యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించారు. భారత్
  • ఫిబ్రవరి 19 కళాతపస్వి కె. విశ్వనాథ్ గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు.
  • మార్చి 12 మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది). భారత్
  • మార్చి 12 ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీ అహ్మదాబాద్ ఆశ్రమం నుంచి దండి వరకు చారిత్రక పాదయాత్రను ప్రారంభించారు. భారత్
  • ఏప్రిల్ 6 మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది. భారత్
  • ఏప్రిల్ 6 ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ అరెస్టు కాగా ఉద్యమ నాయకత్వ బాధ్యతలను సరోజినీ నాయుడుకు అప్పగించారు. భారత్
  • ఏప్రిల్ 18 భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు. భారత్
  • మే 10 అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల) ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.
  • మే 23 స్వాతంత్ర్యోద్యమ ప్రచారానికి బెంబేలెత్తిన బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీ నాయుడును అరెస్టు చేసింది. భారత్
  • మే 24 ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా కు, ఒంటరిగా, 'అమీ జాన్సన్' అనే మహిళ విమానంలో ప్రయాణించింది.
  • మే 24 బ్రాడ్‌మాన్ 290 నిమిషాలలో, 29 ఫోర్స్ (నాలుగులు) లలో 252 పరుగులు సాధించాడు (ఆస్ట్రేలియా వెర్సస్ 'సర్రీ' ).
  • జూన్ 1 భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణే ల మధ్య ప్రారంభించబడింది. భారత్
  • జూలై 13 మొదటి ప్రపంచ కప్పు ఫుట్‌బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.
  • జూలై 18 మొదటి ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.
  • జూలై 20 వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్).
  • జూలై 22 '#1306 స్కిథియా' అనే పేరుగల గ్రహశకలా న్ని (ఆస్టరాయిడ్) 'జి. న్యూజ్మిన్' కనుగొన్నాడు.
  • జూలై 22 హెండ్రిక్ వాన్ జెంట్ రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్) ను కనుగొన్నాడు. వాటి పేర్లు '#1666 వాన్ జెంట్', '#1752 వాన్ హెర్క్'. అలాగే చంద్రుడి అవతలి భాగంలో ఉన్న ఒక క్రేటర్ కి ఇతని పేరు మీద 'వాన్ జెంట్' అని పేరు పెట్టారు.
  • ఆగస్టు 13 కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్, న్యూయార్క్ నుంచి, లాస్ ఏంజిల్స్ వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి, గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
  • ఆగస్టు 29 సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
  • నవంబరు 13 మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు.

జననాలు

  • జనవరి 14 చిత్తజల్లు వరహాలరావు, నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు.
  • జనవరి 28 పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు. భారత్
  • ఫిబ్రవరి 2 బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు. భారత్
  • ఫిబ్రవరి 13 నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
  • ఫిబ్రవరి 13 దాసo గోపాలకృష్ణ , నాటక రచయిత, సినీ గేయ రచయిత (మ.1993).
  • ఫిబ్రవరి 19 కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (మ. 2023).
  • మార్చి 1 సి.డి.గోపీనాథ్, భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెటర్. భారత్
  • మార్చి 14 నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016).
  • మార్చి 15 ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు మ. 2011.
  • ఏప్రిల్ 9 మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు.
  • ఏప్రిల్ 20 త్రిపురనేని మహారధి , సినీ మాటల రచయిత(2011).
  • మే 5 పిఠాపురం నాగేశ్వరరావు, సినీ సంగీత దర్శకులు.
  • మే 5 జస్టిస్ సర్దార్ అలీ ఖాన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2012).
  • మే 17 కుముదిని లఖియా, భారతీయ కథక్ నృత్యకారిణి, నృత్య దర్శకురాలు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత. భారత్
  • జూన్ 3 జార్జి ఫెర్నాండెజ్, భారత రాజకీయవేత్త. భారత్
  • జూన్ 11 ఎ. సి. త్రిలోకచందర్ , తెలుగు, తమిళ, హిందీ చిత్రాల దర్శకుడు.(మ.2016).
  • జూన్ 12 ఆచ్చి వేణుగోపాలాచార్యులు, సినీ గీత రచయిత. (మ.2016).
  • జూన్ 13 మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013).
  • జూలై 1 కుమ్మరి మాస్టారు, బుర్రకథ కళాకారులు. (మ.1997).
  • జూలై 6 మంగళంపల్లి బాలమురళీకృష్ణ, వాగ్గేయకారుడు. (మ.2016).
  • జూలై 9 కైలాసం బాలచందర్, దక్షిణ భారత చలన చిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, (మ.2014). భారత్
  • జూలై 12 ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991).
  • ఆగస్టు 5 నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, చంద్రుడిపై కాలు పెట్టిన మొదటి మనిషి. (మ.2012).
  • ఆగస్టు 12 జార్జ్ సోరోస్, హంగేరియన్-అమెరికన్ కరెన్సి స్పెకులేటర్, స్టాక్ మదుపరుడు, వ్యాపారవేత్త, పరోపకారి,, రాజకీయ ఉద్యమకారుడు.
  • ఆగస్టు 14 జాన నాగేశ్వరరావు, జనవాక్యం పత్రిక నడిపారు.
  • సెప్టెంబరు 22 ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (మ.2013).
  • అక్టోబరు 5 మధురాంతకం రాజారాం, రచయిత. (జ.1999).
  • అక్టోబరు 20 లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టుకు మొదటి మహిళా న్యాయమూర్తి. (మ.2017). భారత్
  • అక్టోబరు 21 షమ్మీ కపూర్, భారత సినీనటుడు, దర్శకుడు. (మ.2011). భారత్
  • అక్టోబరు 24 చవ్వా చంద్రశేఖర్ రెడ్డి, చలనచిత్ర నిర్మాత, పారిశ్రామికవేత్త. (మ.2014).
  • అక్టోబరు 30 వారెన్ బఫ్ఫెట్, యు.ఎస్. మదుపరి, వ్యాపారవేత్త,, లోకోపకారి.
  • నవంబరు 16 చినువ అచెబె, ఆధునిక ఆఫ్రికన్‌ సాహిత్య పితామహుడు. (మ.2013).
  • నవంబరు 20 కొండపల్లి పైడితల్లి నాయుడు, 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (మ.2006). భారత్
  • నవంబరు 22 మిలన్ గుప్తా భారతీయ హార్మోనికా వాద్యకారుడు. (మ.1995). భారత్
  • నవంబరు 23 గీతా దత్, భారతీయ నేపథ్య గాయకురాలు. (మ.1972). భారత్
  • నవంబరు 30 సుధా మల్హోత్రా, భారతీయ నేపథ్య గాయకురాలు. చలనచిత్ర నటి. భారత్
  • డిసెంబరు 2 గారీ బెకర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2014).
  • డిసెంబరు 12 లలిత, చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి.
  • డిసెంబరు 29 టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి, స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012).
  • డిసెంబరు 31 కె. రామలక్ష్మి, ప్రముఖ రచయిత్రి. (మ. 2023).

మరణాలు

  • ఏప్రిల్ 14 ప్రతివాది భయంకర శ్రీనివాస్, చలనచిత్ర నేపథ్యగాయకుడు. (జ.1930).
  • జూలై 26 అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (జ.1856). భారత్
  • ఆగస్టు 20 చార్లెస్ బాన్నర్‌మన్, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు, కుడిచేతి బ్యాట్స్‌మెన్. (జ.1851).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు