జనవరి 26 లాహోర్ కాంగ్రెస్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తొలి సంపూర్ణ స్వరాజ్య దినాన్ని పాటించారు.
భారత్
జనవరి 31 శాసనోల్లంఘనకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టాల్సిన 11 కనీస చర్యలను గాంధీ యంగ్ ఇండియా పత్రికలో ప్రకటించారు.
భారత్
ఫిబ్రవరి 19 కళాతపస్వి కె. విశ్వనాథ్ గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు.
మార్చి 12 మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమైంది. (మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా పసిద్ధి గాంచింది).
భారత్
మార్చి 12 ఉప్పు సత్యాగ్రహంలో భాగంగా గాంధీ అహ్మదాబాద్ ఆశ్రమం నుంచి దండి వరకు చారిత్రక పాదయాత్రను ప్రారంభించారు.
భారత్
ఏప్రిల్ 6 మహాత్మాగాంధీ నేతృత్వంలో గుజరాత్ లోని దండి వద్ద ఉప్పు చట్టం ఉల్లంఘన జరిగింది. మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 మధ్యకాలంలో అహ్మదాబాదు లోని తన ఆశ్రమము నుండి గుజరాత్ తీరంలోని దండీ వరకూ గల 400 కిలో మీటర్ల దూరం కాలినడకన తన యాత్ర సాగించారు. ఈ యాత్ర దండీయాత్రగా లేదా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది.
భారత్
ఏప్రిల్ 6 ఉప్పు సత్యాగ్రహంలో గాంధీజీ అరెస్టు కాగా ఉద్యమ నాయకత్వ బాధ్యతలను సరోజినీ నాయుడుకు అప్పగించారు.
భారత్
ఏప్రిల్ 18 భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
భారత్
మే 10 అమెరికా లో, మొదటి ప్లానెటోరియం (నక్షత్ర శాల) ను చికాగో లోని, ఆడ్లెర్ నగరంలో ప్రారంభించారు.
మే 23 స్వాతంత్ర్యోద్యమ ప్రచారానికి బెంబేలెత్తిన బ్రిటిష్ ప్రభుత్వం సరోజినీ నాయుడును అరెస్టు చేసింది.
భారత్
మే 24 ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా కు, ఒంటరిగా, 'అమీ జాన్సన్' అనే మహిళ విమానంలో ప్రయాణించింది.
మే 24 బ్రాడ్మాన్ 290 నిమిషాలలో, 29 ఫోర్స్ (నాలుగులు) లలో 252 పరుగులు సాధించాడు (ఆస్ట్రేలియా వెర్సస్ 'సర్రీ' ).
జూన్ 1 భారత్లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి - పూణే ల మధ్య ప్రారంభించబడింది.
భారత్
జూలై 13 మొదటి ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఉరుగ్వే లో ప్రారంభమయ్యాయి.
జూలై 18 మొదటి ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలు మాంటే వీడియో నగరంలో ప్రారంభమయ్యాయి.
జూలై 20 వాషింగ్టన్, డి.సి. (జిల్లా రికార్డ్) 106 డిగ్రీల ఫారెన్ హీట్ (41 డిగ్రీల సెంటిగ్రేడ్).
జూలై 22 '#1306 స్కిథియా' అనే పేరుగల గ్రహశకలా న్ని (ఆస్టరాయిడ్) 'జి. న్యూజ్మిన్' కనుగొన్నాడు.
జూలై 22 హెండ్రిక్ వాన్ జెంట్ రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్) ను కనుగొన్నాడు. వాటి పేర్లు '#1666 వాన్ జెంట్', '#1752 వాన్ హెర్క్'. అలాగే చంద్రుడి అవతలి భాగంలో ఉన్న ఒక క్రేటర్ కి ఇతని పేరు మీద 'వాన్ జెంట్' అని పేరు పెట్టారు.
ఆగస్టు 13 కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్, న్యూయార్క్ నుంచి, లాస్ ఏంజిల్స్ వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి, గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
ఆగస్టు 29 సెయింట్ కిల్డాలో వివసిస్తున్న చివరి 36 మంది ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి, స్కాట్లాండులోని ఇతర ప్రదేశాలకు తరలిపోయారు.
నవంబరు 13 మొదటి రౌండు టేబులు సమావేశాన్ని ఐదవ జార్జి చక్రవర్తి లండనులో లాంఛనంగా ప్రారంభించాడు.
జననాలు
జనవరి 14 చిత్తజల్లు వరహాలరావు, నాస్తికయుగం మాసపత్రిక సంపాదకవర్గ సభ్యులుగా పనిచేశారు.
జనవరి 28 పండిట్ జస్రాజ్, హిందుస్తానీ శాస్త్రీయ సంగీతం, మేవాతి ఘరానాకు చెందిన భారతీయ శాస్త్రీయ సంగీత గాయకుడు.
భారత్
ఫిబ్రవరి 2 బి. రాధాబాయి ఆనందరావు, భారత పార్లమెంటు సభ్యురాలు.
భారత్
ఫిబ్రవరి 13 నూతి శంకరరావు, ఆర్యసమాజ్ కు చెందిన నాయకుడు. నిజాం వ్యతిరేక ఉద్యమం వహించాడు.
ఫిబ్రవరి 13 దాసo గోపాలకృష్ణ , నాటక రచయిత, సినీ గేయ రచయిత (మ.1993).
ఫిబ్రవరి 19 కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. (మ. 2023).
మార్చి 1 సి.డి.గోపీనాథ్, భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెటర్.
భారత్
మార్చి 14 నాయని కృష్ణకుమారి, తెలుగు రచయిత్రి. (మ.2016).
మార్చి 15 ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు మ. 2011.
ఏప్రిల్ 9 మన్నవ బాలయ్య, 350 పైగా చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించాడు.
ఏప్రిల్ 20 త్రిపురనేని మహారధి , సినీ మాటల రచయిత(2011).