ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో జన్మించారు.
  • మార్చి 31 కొండా వెంకటప్పయ్య కృషితో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు ప్రారంభమయ్యాయి; గాంధీజీ ఆంధ్ర పర్యటన ఆయన ఆధ్వర్యంలోనే సాగింది.
  • మే 11 టెల్ అవివ్ మొట్టమొదటి యూదుల మునిసిపాలిటీ (నేటి ఇజ్రాయిల్ రాజధాని).
  • మే 12 మొట్ట మొదటి 'నేషనల్ హాస్పిటల్ డే' ని అమెరికాలో జరుపుకున్నారు.
  • మే 14 ఫ్లోరెన్స్ అల్లెన్, మొదటి మహిళా న్యాయమూర్తి, ఒక మనిషికి మరణ శిక్ష విధించింది (అమెరికా).
  • మే 24 ఉత్తర ఐర్లాండ్ తన మొదటి పార్లమెంట్ ని ఎన్నుకొంది. భారత్
  • జూన్ 28 పి.వి.నరసింహారావు వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో జన్మించారు.
  • జూలై 11 పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. భారత్
  • జూలై 20 న్యూయార్క్ నగరం నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి ఎయిర్ మెయిల్ సర్వీస్ మొదలైంది.
  • జూలై 23 అమెరికాకు చెందిన 'ఎడ్వర్డ్ గౌర్డిన్' లాంగ్ జంప్ లో రికార్డు 25' 2 3/4" సాధించాడు.
  • అక్టోబరు 29 టంగుటూరి ప్రకాశం స్వరాజ్య దినపత్రికను ప్రారంభించారు.
  • డిసెంబరు 28 మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు. భారత్

జననాలు

  • జనవరి 15 బాబాసాహెబ్ భోసలే, భారత దేశము, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. భారత్
  • ఫిబ్రవరి 14 దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (మ.1972).
  • మార్చి 7 ఎమ్మెస్ రామారావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. (మ.1992).
  • మే 2 సత్యజిత్ రే, భారత దేశ సినిమా దర్శకుడు. (మ.1992). భారత్
  • మే 7 ఆచార్య ఆత్రేయ, తెలుగు నాటక, సినీ రచయిత. (మ.1989).
  • మే 30 కంచనపల్లి పెదవెంకటరామారావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
  • జూన్ 8 సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008).
  • జూన్ 18 పెండేకంటి వెంకటసుబ్బయ్య, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నరుగా పనిచేశాడు. (మ.1993). భారత్
  • జూన్ 28 పి.వి.నరసింహారావు, భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. (మ.2004).
  • జూలై 4 గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
  • జూలై 8 ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, పారిశ్రామిక వేత్త, దార్శనికుడు (మ. 2011).
  • ఆగస్టు 1 దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆధునిక తెలుగుకవి. (మ.1966).
  • ఆగస్టు 3 లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (మ.2003). భారత్
  • ఆగస్టు 8 వులిమిరి రామలింగస్వామి, పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001).
  • ఆగస్టు 21 భీంరెడ్డి సత్యనారాయణరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచనోద్యమకారుడు. (మ.2012).
  • ఆగస్టు 23 కెన్నెత్ ఆరో, ఆర్థికవేత్త (మ. 2017).
  • సెప్టెంబరు 10 వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (మ.1992).
  • సెప్టెంబరు 21 భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత. భారత్
  • సెప్టెంబరు 24 ధూళిపాళ సీతారామశాస్త్రి, ప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు. (మ.2007).
  • అక్టోబరు 1 తిక్కవరపు వెంకట రమణారెడ్డి, హాస్య నటుడు. (మ.1974).
  • అక్టోబరు 25 టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973).
  • నవంబరు 11 సుసర్ల దక్షిణామూర్తి, దక్షిణభారత చలనచిత్ర సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.2012). భారత్
  • డిసెంబరు 7 భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం. భారత్

మరణాలు

  • జూన్ 25 సెలియా ఫ్రాంకా.
  • సెప్టెంబరు 11 సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (జ.1882). భారత్

ఈ సంవత్సరపు ప్రస్థానాలు