ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 9 దక్షిణాఫ్రికాలో సత్యాగ్రహ పోరాటం ముగించుకుని మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చారు. భారత్
  • జనవరి 13 ఇటలీలోని అవెజ్జానో అనే ప్రాంతంలో సంభవించిన భూకంపంలో దాదాపు 29,800 మంది మరణించారు.
  • ఫిబ్రవరి 16 గాంధీజీ మొదటిసారిగా శాంతినికేతన్ ని సందర్శించాడు. భారత్
  • మార్చి 15 మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో కాన్‌స్టాంటినోపిల్ సంధి జరిగింది.
  • మే 24 థామస్ ఆల్వా ఎడిసన్ టెలిఫోన్ సంభాషణలను రికార్డ్ చేయడానికి 'టెలిస్క్రైబ్' ని కనుగొన్నాడు.
  • ఆగస్టు 6 మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, వార్సా, జర్మనీ చేతుల్లోకి వచ్చింది.
  • ఆగస్టు 18 టెక్సాస్ లోని గాల్వెస్టన్ నగరాన్ని, హరికేన్ (తుఫాను) తాకి 275 మంది మరణించారు.
  • ఆగస్టు 18 డెట్రాయిట్ నగరానికి చెందిన ఛార్లెస్ ఎఫ్. కెట్టెరిన్గ్ ఎలెక్ట్రిక్ ఆటోమొబైల్ సెల్ఫ్-స్టార్టర్ కి పేటెంట్ పొందాడు.
  • ఆగస్టు 29 యు.ఎస్. నేవీ గజ ఈతగాళ్ళు ప్రమాదంలో మొదటిసారిగా ములిగిపోయిన ఎఫ్-4 అనే జలాంతర్గామిని బయటికి తీసారు.
  • నవంబరు 30 కన్యాశుల్కం నాటక కర్త, అభ్యుదయ కవితా పితామహుడు గురజాడ అప్పారావు కన్నుమూశారు.

జననాలు

  • జనవరి 4 పాకాల తిరుమల్ రెడ్డి, చిత్రకారుడు. (మ.1996).
  • జనవరి 15 చాగంటి సోమయాజులు, ఈయన రాసిన చాలా కథలు హింది, రష్యన్, కన్నడ, మరాఠి, మలయాళ, ఉర్దూ భాషలలోకి అనువదించబడ్డాయి. (మ.1994).
  • జనవరి 21 పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి, నెల్లూరు నగరంలో నడుస్తున్న రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల వ్యవస్థాపకుడు.
  • జనవరి 23 ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
  • ఫిబ్రవరి 2 కుష్వంత్ సింఘ్, రచయిత.
  • ఫిబ్రవరి 5 గరికపాటి రాజారావు, ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు. (మ.1963).
  • ఫిబ్రవరి 20 గొల్లకోట బుచ్చిరామశర్మ, జీవరసాయన శాస్త్రము, పౌష్టికాహారం, ఫార్మాన్యూటికల్స్ రంగాలలో ఎంతో విలువైన పరిశోధనలు జరిపారు.
  • ఫిబ్రవరి 22 పువ్వుల సూరిబాబు, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, గాయకుడు, నాటక ప్రయోక్త. (మ.1968).
  • మార్చి 11 విజయ్ హజారే, భారత క్రికెటర్ జననం. (మ. 2004). భారత్
  • మార్చి 20 చిర్రావూరి లక్ష్మీనరసయ్య, తెలంగాణా పోరాటయోధుడు, కమ్యూనిస్టు నాయకుడు.
  • మార్చి 21 మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన వారు విద్యావేత్త, మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు. భారత్
  • ఏప్రిల్ 2 కొచ్చర్లకోట సత్యనారాయణ, తెలుగు సినిమా, రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు, నేపథ్యగాయకుడు. (మ.1969).
  • ఏప్రిల్ 17 సిరిమావో బండారునాయకే, శ్రీలంక రాజకీయవేత్త, ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి. (మ. 2000). భారత్
  • మే 15 పాల్ సామ్యూల్‌సన్, ఆర్థికవేత్త (మ.2009).
  • మే 19 మోషే డయాన్, ఇజ్రాయల్ సైనిక అధికారి.
  • మే 20 మోషే డయన్, ఇజ్రాయెల్ మిలిటరీ జనరల్, రాజకీయనాయకుడు. ఇజ్రాయెల్ ను ప్రపంచపటం నుంచి తొలగిస్తామన్న ఆరబ్ దేశాలను గడ గడలాడించి, ఓడించిన ఇజ్రాయెల్ దేశపు సింహం (మ.1981).
  • జూన్ 6 చండ్ర రాజేశ్వరరావు, కమ్యూనిస్టు నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు సామ్యవాది, తెలంగాణా సాయుధ పోరాటంలో నాయకుడు. (మ.1994).
  • జూన్ 6 విక్రాల శేషాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు, కవి. భారత్
  • జూన్ 12 యామిజాల పద్మనాభ స్వామి , బహుముఖ ప్రజ్ఞాశాలి , సంసృతంద్రా పండితుడు , స్వాతంత్ర పోరాట యోధుడు.
  • జూన్ 16 మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (మ.1998).
  • జూన్ 24 పాలగుమ్మి పద్మరాజు, తెలుగు సినీ రచయిత. (మ.1983).
  • జూలై 7 యూల్ బ్రిన్నర్, అమెరికన్ సినీ నటుడు.
  • జూలై 13 గుత్తి రామకృష్ణ, కథకుడు, పాత్రికేయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.2009). భారత్
  • జూలై 26 ప్రగడ కోటయ్య, సంఘ సేవకులు.(మ.1995).
  • ఆగస్టు 4 లంక సత్యం , తెలుగు, తమిళ, సినిమా నటుడు , దర్శకుడు.
  • ఆగస్టు 15 ఇస్మత్ చుగ్తాయ్, ఉర్దూ అభ్యుదయ రచయిత్రి. (మ.1994).
  • సెప్టెంబరు 11 పుపుల్ జయకర్, భారతదేశ కళాకారిణి, రచయిత్రి. (మ.1997). భారత్
  • సెప్టెంబరు 17 ఎమ్.ఎఫ్. హుస్సేన్, భారతీయ చిత్రకారుడు. (మ.2011). భారత్
  • సెప్టెంబరు 27 కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (మ.2012).
  • సెప్టెంబరు 28 స్థానాపతి రుక్మిణమ్మ, సంస్కృతాంధ్ర పండితురాలు, రచయిత్రి. భారత్
  • అక్టోబరు 1 కళాధర్, చిత్ర కళా దర్శకుడు. (మ.2013).
  • అక్టోబరు 21 విద్వాన్ విశ్వం, తెలుగు వెలుగులను అందంగా విస్తరిస్తూ అసభ్యతలకు దూరంగా తెలుగు వారపత్రిక "ఆంధ్రప్రభ" నడిపించిన సంపాదకుడు.
  • నవంబరు 1 వట్టికోట ఆళ్వారుస్వామి, రచయిత, ప్రజా ఉద్యమనేత. (మ.1961).
  • డిసెంబరు 26 జూపూడి యజ్ఞనారాయణ, న్యాయవాది, రాజకీయవేత్త, కళాకారుడు.

మరణాలు

  • ఫిబ్రవరి 19 గోపాలకృష్ణ గోఖలే, భారత జాతీయ నాయకుడు. (జ.1866). భారత్
  • నవంబరు 30 గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (జ.1862).
  • డిసెంబరు 14 కొక్కొండ వేంకటరత్నం పంతులు. మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆధునికాంధ్రులలో రెండవ వ్యక్తిగా ఘనత వహించిన సంగీతజ్ఞుడు, కవి, నాటక రచయిత. (జ.1842).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు