ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 25 ఫాతిమాబీవి తమిళనాడు గవర్నరుగా నియామకం. భారత్
  • ఫిబ్రవరి 22 తెలుగు కథల సేకరణకు అంకితమైన ఒక గ్రంథాలయం కథానిలయం ప్రారంభం.
  • మార్చి 7 దాసరి దర్శకత్వంలో విజయశాంతి నటించిన ఒసేయ్ రాములమ్మా విడుదలై బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.
  • మార్చి 24 భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ. భారత్
  • ఏప్రిల్ 21 భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ నియమితుడైనాడు. భారత్
  • మే 12 ఆస్ట్రేలియాకు చెందిన 'సుసాన్ జీన్ (సుసీ) మరోనీ' (22 సంవత్సరాలు),క్యూబా నుంచి ఫ్లోరిడా స్ట్రెయిట్స్ (అమెరికా) వరకూ (180 కి.మీ - 112 మైళ్ళు) ఈత కొట్టిన మొదటి మనిషి, మొదటి మహిళ. ఈమె సెరిబ్రల్ ఫాల్సీ వ్యాధితో పుట్టింది.
  • మే 16 రష్యా యొక్క "మీర్" రోదసీ స్టేషనుతో అమెరికాకు చెందిన అట్లాంటిస్ స్పేస్ షటిల్ జతగా కలిసాయి. (డాకింగ్ అయ్యాయి) ".
  • జూలై 1 బ్రిటన్ 156 సంవత్సరాల బ్రిటిష్ వలస అయిన 'హాంకాంగ్ ' ని చైనాకు తిరిగి ఇచ్చింది. భారత్
  • జూలై 25 భారత రాష్ట్రపతిగా కె.ఆర్.నారాయణన్ పదవిని స్వీకరించాడు. భారత్
  • జూలై 26 వి.ఎస్. రమాదేవి హిమాచల్ ప్రదేశ్ గవర్నరుగా నియామకం.
  • ఆగస్టు 6 శ్రీలంక క్రికెట్ జట్టు టెస్ట్ క్రికెట్‌లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
  • అక్టోబరు 1 జనరల్ వి.పి. మాలిక్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం. భారత్
  • అక్టోబరు 15 ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తకానికి గాను రచయిత్రి అరుంధతీ రాయ్కు బ్రిటన్‌ అత్యున్నత సాహితీ పురస్కారం 'బుకర్స్‌ ప్రైజ్‌' లభించింది.
  • నవంబరు 7 విజయశాంతి నటించిన రౌడీ దర్బార్ చిత్రం విడుదలైంది.
  • నవంబరు 22 హైదరాబాదులో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.
  • నవంబరు 23 ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భారత్
  • నవంబరు 24 ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.
  • డిసెంబరు 17 భోగరాజు పట్టాభి సీతారామయ్య గౌరవార్థం ప్రత్యేక తపాలా బిళ్ళ విడుదలైంది. భారత్

జననాలు

  • ఫిబ్రవరి 7 మేఘా చౌదరి , బెంగాలీ, తెలుగు, తమిళ నటి.
  • మార్చి 6 ఝాన్వికపూర్ , హిందీ , చిత్ర నటి ,(నటి శ్రీదేవి కుమార్తె). భారత్
  • మార్చి 28 అనూ ఇమ్మానియేలు , భారతీయ చలనచిత్ర నటి. భారత్
  • ఏప్రిల్ 12 ఆకాష్ పూరీ, తెలుగు చలనచిత్ర నటుడు.
  • జూలై 5 కార్తీక్ రత్నం , నాటక రంగ , సినిమా నటుడు.
  • జూలై 6 అదితి శంకర్, తెలుగు, తమిళ చలన చిత్ర నటి, ప్లేబ్యాక్ సింగర్.
  • ఆగస్టు 12 సాయేశా సైగల్, తెలుగు, తమిళ, హిందీ, చిత్రాల నటి.
  • ఆగస్టు 19 డాన్ స్టీల్, అమెరికన్ ఫిల్మ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్, నిర్మాత.
  • సెప్టెంబరు 12 శాన్వీ మేఘన , తెలుగు సినీ నటి.
  • సెప్టెంబరు 14 ఎల్విష్ యాదవ్, ఒక భారతీయ యూట్యూబర్, గాయకుడు. హిందీ బిగ్ బాస్ -2వ సీజన్ విజేత. భారత్
  • అక్టోబరు 20 తులసి నాయర్ , మోడల్, తమిళ నటి(నటి రాధ కుమార్తె). భారత్

మరణాలు

  • జనవరి 22 ఎల్. కిజుంగ్లుబా ఆవో, నాగాలాండ్‌కు చెందిన మొదటి బాప్టిస్ట్ మిషనరీ. సమాజ సేవకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1906).
  • ఫిబ్రవరి 19 డెంగ్ జియావోపింగ్, చైనా కమ్యూనిస్ట్ నాయకుడు, సంస్కర్త.
  • ఫిబ్రవరి 22 షేక్ నాజర్, బుర్రకథ పితామహుడు. (జ.1920).
  • మార్చి 1 యలమంచిలి వెంకటప్పయ్య, స్వాతంత్ర్య సమరయోధుడు. భారత్
  • మార్చి 9 బెజవాడ గోపాలరెడ్డి, ఆంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1907).
  • మార్చి 10 స్వర్ణలత తెలుగు సినిమా నేపథ్య గాయని. (పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో పరిచయం). (జ.1928.).
  • ఏప్రిల్ 10 మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పాత్ర పోషించారు (జ.1920).
  • మే 24 నల్లమల గిరిప్రసాద్, కమ్యూనిస్టు నేత. (జ.1931).
  • మే 28 కుమ్మరి మాస్టారు, ప్రసిద్ధిచెందిన బుర్రకథ కళాకారులు. (జ.1930).
  • ఆగస్టు 5 బోడేపూడి వెంకటేశ్వరరావు, కమ్యునిష్టు నాయకుడు. (జ.1922).
  • ఆగస్టు 7 శ్రీరాం వెంకట (యస్వీ) భుజంగరాయ శర్మ, రచయిత.
  • ఆగస్టు 17 ఎస్.వి.భుజంగరాయశర్మ, కవి, విమర్శకుడు, నాటక రచయిత (జ.1925).
  • ఆగస్టు 31 ప్రిన్సెస్ డయానా, బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ మాజీ భార్య (జ.1961).
  • సెప్టెంబరు 5 మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910).
  • సెప్టెంబరు 27 మండలి వెంకటకృష్ణారావు, గాంధేయవాది. మాజీ రాష్ట్రమంత్రి (జ.1926).
  • అక్టోబరు 1 గుల్ మొహమ్మద్, తను ఉన్నప్పటి కాలంలో ధ్రువీకరించబడిన అత్యంత పొట్టి మనిషి.
  • అక్టోబరు 11 గబ్బిట వెంకటరావు , సినీ, నాటక, రచయిత . పద్యకవి , నిర్మాత ,దర్శకుడు(జ.1928).
  • నవంబరు 26 మందాడి ప్రభాకర రెడ్డి, తెలుగు సినిమా నటుడు, కథా రచయిత (జ.1935).
  • డిసెంబరు 2 లక్కోజు సంజీవరాయశర్మ, ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి (జ.1907).
  • డిసెంబరు 23 గట్టి లక్ష్మీనరసింహ శాస్త్రి, పండితులు. (జ.1913).
  • డిసెంబరు 25 జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911).

సినిమా

  • జనవరి 14 'శుభాకాంక్షలు' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 15 'మావా బాగున్నావా?' చిత్రం విడుదలైంది.
  • అక్టోబరు 30 'పెళ్ళికొడుకు అమ్మబడును' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 7 'రౌడీ దర్బార్' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 28 'కుర్రాళ్ళ రాజ్యం' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు