ఈ రోజు విశేషం
1881 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
సంఘటనలు
- 1613 సామ్యూల్ అర్గాల్ ఆధ్వర్యంలో మెసాచుసెట్స్ నుంచి అకాడియాకి (నేటి క్విబెక్ లోని కొంత ప్రాంతం) మొదటి ఇంగ్లీష్ వారి సాహస యాత్ర ప్రారంమైంది.
- 1644 ఇంగ్లీష్ సివిల్ వార్: మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
- 1679 డేనియల్ గ్రేసలన్ డి డు లుత్ నాయకత్వంలో యూరోపియన్లు మొదటిసారిగా మిన్నెసోటా వెళ్ళి అక్కడి మిస్సిసిపి నది హెడ్ వాటర్స్ ని చూసారు.
- 1698 థామస్ సావెరీ మొదటి స్టీమ్ ఇంజన్ కి పేటెంట్ హక్కులు పొందాడు.
- 1777 అమెరికా లోని 'వెర్మెంట్' అనే ప్రాంతంలో మొదటిసారిగా 'బానిసత్వాన్ని' నిర్మూలించారు.
- 1823 బహియా దేశ స్వాతంత్ర్య దినం: బహియా దేశంలో జరిగిన ఆఖరి యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు. ఆ ఓటమితో బ్రెజిల్ లో పోర్చుగీసు వారి పాలన అంతమయ్యింది. భారత్
- 1839 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరానికి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక 'అమిస్తాడ్'ని స్వాధీనం చేసుకున్నారు.
- 1863 అమెరికన్ సివిలి వార్: గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.
- 1881 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
- 1897 ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని లండన్ లో రేడియో కోసం పేటెంట్ పొందాడు.
- 1900 జర్మనీ లోని కాన్స్ టేన్స్ చెరువులో (ఫ్రీడ్రిఖ్ షాఫెన్ దగ్గర) మొదటి 'జెప్లిన్ విమానం' ఎగిరింది.
- 1940 స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు. భారత్
- 1962 అమెరికాలోని ఆర్కన్సాస్ రాష్ట్రంలోని 'రోజెర్స్' అనే నగరంలో మొదటి 'వాల్ మార్ట్' చిల్లర దుకాణం వ్యావారం నిమిత్తం మొదలయ్యింది.
- 1976 ఉత్తర, దక్షిణ వియత్నాం దేశాలు, 22 సంవత్సరాల తర్వాత, తిరిగి ఒకటైనాయి.
- 2000 ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది.
- 2009 స్వలింగ సంపర్కం చట్టబద్ధమేనంటూ ఢిల్లీ హై కోర్టు తుది తీర్పు వెలువరించింది. భారత్
జననాలు
- 1923 విస్లావా సింబోర్స్కా, కవయిత్రి, అనువాదకురాలు. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2012).
- 1939 మల్లెల గురవయ్య, కవి, మదనపల్లె రచయితల సంఘం (మరసం) స్థాపకుడు. (మ.2016).
- 1945 ఎస్.ఏ.చంద్రశేఖర్ , తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.
- 1952 భానుచందర్ , తెలుగు ,తమిళ, చిత్రాల నటుడు, దర్శకుడు.
- 1965 కృష్ణ భగవాన్, తెలుగు చలనచిత్ర హాస్యనటుడు, రచయిత.
- 1965 జయలలిత, చలన చిత్ర నటి.
- 1968 గౌతమి తెలుగు, తమిళ సినిమా నటి.
మరణాలు
- 1566 నోస్ట్రడామస్, ఫ్రాన్సుకు చెందిన జ్యోతిష్కుడు, ప్రవక్త.
- 1644 విలియం గేస్కోయిన్, ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త. (జ.1612).
- 1843 శామ్యూల్ హనెమాన్, హొమియోపతీ వైద్యశాస్త్ర పితామహుడు. (జ.1755).
- 1961 హెమింగ్వే, సాహిత్యములో నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1899).
- 1982 చెరబండరాజు, విప్లవ కవి. (జ.1944).
- 1995 గడ్డం రాంరెడ్డి, దూరవిద్య ప్రముఖులు, సమాజ శాస్త్ర విజ్ఞానంలో మేటి వ్యక్తి. వీరిని "సార్వత్రిక విశ్వవిద్యాలయ పితామహుడు". (జ.1929).
- 2002 దోమాడ చిట్టబ్బాయి, నాదస్వర విద్వాంసులు. (జ.1933).
- 2005 పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (జ.1923).
సినిమా
- 1992 'కాలేజీ బుల్లోడు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ క్రీడా జర్నలిస్ట్ ల దినోత్సవం.
- ప్రపంచ యూ.ఎఫ్.ఓ.దినోత్సవం.
- జాతీయ అనిసెట్ దినోత్సవం.