ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 3 ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.
  • ఫిబ్రవరి 1 అమెరికా స్పేస్‌ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది. భారత్
  • ఫిబ్రవరి 11 గాయకుడు ఘంటసాల గౌరవార్థం భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది; ఈ గౌరవం పొందిన దక్షిణాది తొలి సినీ గాయక-సంగీతకారుడు ఆయనే. భారత్
  • ఫిబ్రవరి 20 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది.
  • మే 9 రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సింహాద్రి అతిపెద్ద విజయం సాధించి తొలి ఫిల్మ్‌ఫేర్ తెచ్చిపెట్టింది.
  • మే 9 మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' ఆ ఏటి అతిపెద్ద విజయంగా నిలిచి తొలి ఫిల్మ్‌ఫేర్ పురస్కారం తెచ్చిపెట్టింది.
  • జూన్ 20 వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
  • జూలై 3 రాజమౌళి రెండో చిత్రం సింహాద్రి అప్పటి అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
  • ఆగస్టు 3 అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
  • ఆగస్టు 10 ఎన్నడూ లేని ఎండ వేడికి (100 డిగ్రీల పారెన్‌హీట్ కి పైనే) బ్రిటన్ వాసులు మల మల మాడిపోయారు. దేశంలోని, సముద్రపు ఒడ్డులు, జనసముద్రమే అయ్యాయి. రహదారులు అన్నీ, ట్రాఫిక్ మూలంగా, అదుపు తప్పాయి.
  • ఆగస్టు 25 బొంబాయి నగరములో కారు బాంబులు పేలి విధ్వంసం సృష్టించబడింది. భారత్
  • ఆగస్టు 27 దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది.
  • అక్టోబరు 1 అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యాహత్నం.
  • అక్టోబరు 1 తిరుపతి అలిపిరి వద్ద నక్సలైట్ల మందుపాతర దాడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
  • అక్టోబరు 17 'జితి జితాయి పాలిటిక్స్‌'... మధ్యప్రదేశ్‌లో హిజ్రా ల తొలి రాజకీయపార్టీ స్థాపన. భారత్
  • డిసెంబరు 10 తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
  • డిసెంబరు 30 శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు.

జననాలు

  • మే 12 ప్రిన్స్ సద్రుద్దిన్ ఆగా ఖాన్, ఫ్రెంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫొర్ రెఫ్యూజీస్ (కాందిశీకులకు) (జ.1933).
  • సెప్టెంబరు 21 కృతి శెట్టి, తెలుగు సినీ నటి.

మరణాలు

  • జనవరి 18 హరి వంశ రాయ్ బచ్చన్, హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి. (జ.1907). భారత్
  • జనవరి 29 పండరీబాయి, కన్నడ, తెలుగు, తమిళ ,హిందీ చిత్రాల నటి (జ.1930).
  • జనవరి 31 మేకా రంగయ్య అప్పారావు, నూజివీడు జమిందారీ కుటుంబానికి చెందిన విద్యావేత్త, మాజీ మంత్రి.
  • ఫిబ్రవరి 1 కల్పనా చావ్లా, ఇండియన్ -అమెరికన్ వ్యోమగామి, వ్యోమనౌక యంత్ర నిపుణురాలు. (జ.1962).
  • ఫిబ్రవరి 24 ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (జ.1929).
  • మార్చి 3 కె. ఎమ్. మమ్మెన్ మప్పిళ్ళై, భారతీయ వ్యాపారవేత్త, ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1922). భారత్
  • మార్చి 28 లావు బాలగంగాధరరావు, భారత కమ్యూనిస్టు పార్టీ - మార్క్సిస్టు నాయకుడు. (జ.1921). భారత్
  • ఏప్రిల్ 29 వావిలాల గోపాలకృష్ణయ్య, స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. భారత్
  • మే 9 క్రాంతి కుమార్, నిర్మాత,దర్శకుడు, (జ.1942).
  • జూన్ 22 కోదాటి లక్ష్మీ నరసింహారావు.
  • జూలై 22 'ఉదయ్', ఖుసే హుస్సేన్', సద్దాం హుస్సేన్ కుమారులు. ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.
  • జూలై 27 ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (జ.1917).
  • సెప్టెంబరు 9 గులాబ్‌రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927). భారత్
  • అక్టోబరు 25 కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు (జ.1944).
  • అక్టోబరు 31 అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914). భారత్
  • నవంబరు 25 ఇస్మాయిల్, కవి, అధ్యాపకుడు. (జ.1928).

సినిమా

  • జనవరి 3 'పిలిస్తే పలుకుతా' చిత్రం విడుదలైంది.
  • మే 2 'హైటెక్ స్టూడెంట్స్' చిత్రం విడుదలైంది.
  • మే 9 'విజయం' చిత్రం విడుదలైంది.
  • జూలై 3 'సింహాద్రి' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 15 'చార్మినార్ (2003 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • సెప్టెంబరు 12 'పెళ్ళాంతో పనేంటి' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 6 'మా అల్లుడు వెరీగుడ్' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు