జనవరి 3 ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.
ఫిబ్రవరి 1 అమెరికా స్పేస్ షటిల్ కొలంబియా, అంతరిక్షం నుండి భూమికి దిగి వచ్చేటపుడు కాలిపోయింది. ఈ దుర్ఘటనలో మరణించిన ఏడుగురిలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా ఉంది.
భారత్
ఫిబ్రవరి 11 గాయకుడు ఘంటసాల గౌరవార్థం భారత ప్రభుత్వం తపాలా బిళ్ళను విడుదల చేసింది; ఈ గౌరవం పొందిన దక్షిణాది తొలి సినీ గాయక-సంగీతకారుడు ఆయనే.
భారత్
ఫిబ్రవరి 20 13వ అలీన దేశాల సదస్సు కౌలాలంపూర్లో ప్రారంభమైనది.
మే 9 రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన సింహాద్రి అతిపెద్ద విజయం సాధించి తొలి ఫిల్మ్ఫేర్ తెచ్చిపెట్టింది.
మే 9 మహేష్ బాబు నటించిన 'ఒక్కడు' ఆ ఏటి అతిపెద్ద విజయంగా నిలిచి తొలి ఫిల్మ్ఫేర్ పురస్కారం తెచ్చిపెట్టింది.
జూలై 3 రాజమౌళి రెండో చిత్రం సింహాద్రి అప్పటి అత్యధిక వసూళ్ల తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఆగస్టు 3 అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ ఛర్చ్, రెవరెండ్ జెనె రోబిన్సన్, అనే, హిజ్రా (కొజ్జా) ని బిషప్గా నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగష్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
ఆగస్టు 10 ఎన్నడూ లేని ఎండ వేడికి (100 డిగ్రీల పారెన్హీట్ కి పైనే) బ్రిటన్ వాసులు మల మల మాడిపోయారు. దేశంలోని, సముద్రపు ఒడ్డులు, జనసముద్రమే అయ్యాయి. రహదారులు అన్నీ, ట్రాఫిక్ మూలంగా, అదుపు తప్పాయి.
ఆగస్టు 25 బొంబాయి నగరములో కారు బాంబులు పేలి విధ్వంసం సృష్టించబడింది.
భారత్
ఆగస్టు 27 దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది.
అక్టోబరు 1 అలిపిరి వద్ద చంద్రబాబు నాయుడుపై నక్సలైట్లు హత్యాహత్నం.
అక్టోబరు 1 తిరుపతి అలిపిరి వద్ద నక్సలైట్ల మందుపాతర దాడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అక్టోబరు 17 'జితి జితాయి పాలిటిక్స్'... మధ్యప్రదేశ్లో హిజ్రా ల తొలి రాజకీయపార్టీ స్థాపన.
భారత్
డిసెంబరు 10 తెలుగు వికీపీడియా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం ప్రారంభం.
డిసెంబరు 30 శ్రీజయ ఆర్ట్స్ సంస్థను హైదరాబాద్ లో ఇదేరోజున సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు, డాక్టర్ శ్రీజ సాధినేని గారు స్థాపించారు. ఈ సంస్థలో కళలపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ నటులుగా తీర్చి దిద్దుతున్నారు. అలాగే శ్రీజయా ఆర్ట్స్ నాటక పరిషత్తు పేరిట అఖిల భారత స్థాయిలో నాటికల పోటీలను నిర్వహిస్తున్నారు.
జననాలు
మే 12 ప్రిన్స్ సద్రుద్దిన్ ఆగా ఖాన్, ఫ్రెంచి యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫొర్ రెఫ్యూజీస్ (కాందిశీకులకు) (జ.1933).
జూలై 22 'ఉదయ్', ఖుసే హుస్సేన్', సద్దాం హుస్సేన్ కుమారులు. ఉత్తర ఇరాక్ లో జరిగిన యుద్ధంలో, తుపాకీ కాల్పులకు మరణించారని అమెరికా ప్రకటించింది.
జూలై 27 ఆవుల సాంబశివరావు, న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (జ.1917).
సెప్టెంబరు 9 గులాబ్రాయ్ రాంచంద్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1927).
భారత్
అక్టోబరు 25 కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు (జ.1944).
అక్టోబరు 31 అయ్యగారి సాంబశివరావు ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. (జ.1914).
భారత్