ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 14 నటుడు రావు గోపాలరావు కాకినాడ సమీపంలోని గంగనపల్లిలో జన్మించారు.
  • జనవరి 14 ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు కృష్ణా జిల్లా చిన నందిగామలో ఒక రైతు కుటుంబంలో జన్మించారు.
  • మే 12 కింగ్ జార్జి VI పట్టాభిషేకం గ్రేట్ బ్రిటన్లో జరిగింది.
  • జూలై 23 'పిట్యూటరీ హార్మోన్' ని వేరు చేసినట్లుగా 'యేల్ యూనివెర్సిటీ' ప్రకటించింది.
  • ఆగస్టు 2 మారిజునా, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులను నిషేధిస్తూ, అమెరికా, 1937 లో ’ది మారిహున టాక్స్ చట్టము’ చేసింది. (మారిజునా – ప్రమాదకరమైన మత్తు పదార్ధము).
  • నవంబరు 15 కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ రెండు ప్రాంతాల నాయకులు, శ్రీ బాగ్ ఒడంబడిక పై సంతకాలు చేసారు. దాని ప్రకారం, రాజధాని, హై కోర్టు, విశ్వ విద్యాలయం ఒకే చోట కాకుండా, వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దాని ప్రకారం, గుంటూరులో 1954 జూలై 5 నాడు హై కోర్టుని నెలకొల్పారు. కర్నూలును (రాయల సీమ) రాజధానిని చేసారు. విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).
  • నవంబరు 16 కోస్తా ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో ఇది ఒక ముఖ్యమైన ఘట్టం.

జననాలు

  • జనవరి 2 చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
  • జనవరి 2 మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు. భారత్
  • జనవరి 7 దొడ్డపనేని ఇందిర, రాజకీయవేత్త, మంత్రివర్యులు. (మ.1987).
  • జనవరి 14 రావు గోపాలరావు, తెలుగు సినిమా నటుడు. (మ.1994).
  • జనవరి 14 శోభన్ బాబు, తెలుగు కథానాయకుడు. (మ.2008).
  • ఫిబ్రవరి 5 ఏ.సి.జోస్, మాజీ పార్లమెంటరీ సభ్యుడు, మాజీ కేరళ శాసనసభ స్పీకర్‌. (మ.2016). భారత్
  • మార్చి 3 సత్యం శంకరమంచి, పాఠకుణ్ణి ఏకబిగిగా చదివించే గుణం సత్యం కథలలో ఉంది. అమరావతి కథలు గ్రంథానికి 1979లో రాష్ట్ర సాహిత్య అకాడమీ పొందారు.
  • మార్చి 5 నెమలికంటి తారకరామారావు, శ్రీకళానికేతన్ సంస్థను స్థాపించి, ఆ సంస్థ తరపున 30 నాటక, నాటికలను హైదరాబాదులోనూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోనూ ప్రదర్శింపజేశారు.
  • మార్చి 12 శ్రీ భాష్యం విజయసారథి సంస్కృత భాషా పండితుడు, అమర భాషలో ఆధునికుడు, తెలంగాణ సంస్కృత వాచస్పతి.
  • మార్చి 13 వల్లంపాటి వెంకటసుబ్బయ్య, సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.
  • మార్చి 14 జొన్నలగడ్డ గురప్పశెట్టి, కలంకారీ కళాకారుడు, 2009లో పద్మశ్రీ పురస్కారము తోనూ సత్కరించబడ్డారు.
  • మార్చి 15 వల్లంపాటి వెంకటసుబ్బయ్య, తెలుగు సాహితీ విమర్శకుడు. (మ.2007).
  • మార్చి 27 రాగిణి , చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి(మ.1976).
  • ఏప్రిల్ 5 చేగొండి వెంకట హరిరామజోగయ్య, భారత మాజీ పార్లమెంటు సభ్యుడు, తెలుగు సినిమా నిర్మాత.
  • మే 12 జార్జ్ కార్లిన్, అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు,, రచయిత. (మ.2008).
  • మే 26 మనోరమ, దక్షిణ భారత సినిమా నటీమణి. (మ.2015). భారత్
  • జూన్ 13 డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు.
  • జూలై 1 పడాల బాలకోటయ్య, రంగస్థల నటులు, దర్శకులు, న్యాయనిర్ణేత. (మ.2015).
  • జూలై 27 రాజ్ వీర్ సింగ్ యాదవ్, భారతదేశపు మొట్టమొదటి మూత్రపిండ మార్పిడి శస్త్రవైద్యుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (మ.2006). భారత్
  • సెప్టెంబరు 14 ఎస్.మునిసుందరం, కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు. (మ.2015).
  • అక్టోబరు 31 నరిశెట్టి ఇన్నయ్య, హేతువాది, తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర రచించాడు.
  • నవంబరు 3 జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (మ.2004). భారత్
  • నవంబరు 3 లక్ష్మీకాంత్ ,(లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీత ద్యయం లో ఒకరు) సంగీత దర్శకుడు.
  • నవంబరు 7 కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (మ.2016). భారత్
  • నవంబరు 30 వడ్డెర చండీదాస్, తెలుగు నవలా రచయిత. (మ.2005).
  • డిసెంబరు 2 మనోహర్ జోషి, మహారాష్ట్ర 15వ ముఖ్యమంత్రి. (మ.2024). భారత్
  • డిసెంబరు 15 పింగళి వెంకట రమణారావు, ఎలెక్ట్రాన్ అనే కలంపేరుతో ప్రసిద్ధుడైన కథా రచయిత.
  • డిసెంబరు 18 కాకరాల సత్యనారాయణ, నటుడు, పాత్రికేయుడు, డబ్బింగ్‌ ఆర్టిస్టు.
  • డిసెంబరు 28 ఇండియా - రతన్ టాటా, పారిశ్రామికవేత్త. భారత్
  • డిసెంబరు 31 ఆంథోనీ హాప్కిన్స్, నటుడు.

మరణాలు

  • జనవరి 14 జయశంకర్ ప్రసాద్, ఆధునిక హిందీ సాహిత్యవేత్త. భారత్
  • ఫిబ్రవరి 7 ఎలిహూ రూట్ అమెరికన్ దౌత్యవేత్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరణించాడు.
  • జూన్ 23 కొంపెల్ల జనార్ధనరావు, భావకవి, నాటక రచయిత. శ్రీశ్రీ మహాప్రస్థానం కవితా సంపుటాన్ని ఇతనికి అంకితమిచ్చాడు. (జ.1907).
  • జూలై 20 గూగ్లి ఎల్మో మార్కోని, రేడియోని కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1874).
  • అక్టోబరు 15 నెమిలి పట్టాభి రామారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, కొచ్చిన్ సంస్థానం యొక్క మాజీ దీవాన్‌. (జ.1862). భారత్
  • అక్టోబరు 17 వడ్డెపాటి నిరంజనశాస్త్రి, గుంటూరు జిల్లా నుండి వెలువడిన మొదటి పత్రిక ప్రబోధిని సంపాదకుడు. (జ.1877).
  • అక్టోబరు 19 ఎర్నెస్ట్ రూథర్‌ఫోర్డ్, న్యూజీలాండ్ కు చెందిన ఒక రసాయనిక శాస్త్రజ్ఞుడు (జ.1871).
  • నవంబరు 23 జగదీశ్ చంద్ర బోస్, వృక్ష శాస్త్రవేత్త. (జ.1858).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు