ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 18 ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు; ఆమె పేరిటే తరువాత అన్నపూర్ణ స్టూడియోస్ నెలకొల్పారు.
  • మార్చి 2 భారత కోకిల, తొలి మహిళా గవర్నరు సరోజినీ నాయుడు లక్నోలో కన్నుమూశారు. భారత్
  • మే 11 మొదటి పోలరాయిడ్ కెమెరాని 89.95 అమెరికన్ డాలర్లకు న్యూయార్క్ లో అమ్మారు.
  • మే 11 ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది.
  • మే 11 సియాం (సయాం) దేశం తన పేరుని థాయ్‌లాండ్గా మార్చుకున్నది.
  • మే 12 అమెరికాలో మొట్ట మొదటి మహిళా రాయబారిగా శ్రీమతి విజయలక్ష్మి పండిట్ ని భారతదేశం నియమించింది. భారత్
  • జూలై 1 ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ దినోత్సవం భారతదేశపు పార్లమెంటు, ఈ రోజు న 1949 లో ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ చట్టం చేసింది. అందుకోసం, భారతదేశంలోని ది ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐ.సి.ఏ.ఐ), ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ అందరూ ఛార్టర్డ్ అక్కౌంటెంట్స్ డేని జరుపుకుంటున్నారు. భారత్
  • జూలై 1 కొచిన్, ట్రావెన్కోర్ అనే రెండు సంస్థానాలను కలిపి తిరు-కోచి రాష్ట్రంగా (తరువాత ఈ రాష్ట్రాన్ని కేరళ రాష్ట్రంగా పునర్వవస్తీకరించారు) భారత దేశంలో కలిపి వేసారు. అంతటితో, 1000 సంవత్సరాలుగా పాలిస్తున్న, కొచిన్ రాజకుటుంబం పాలన అంతమయ్యింది. భారత్
  • జూలై 8 వై.ఎస్.రాజశేఖరరెడ్డి జమ్మలమడుగులోని సి.ఎస్.ఐ. కాంప్‌బెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు.
  • జూలై 9 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ఆవిర్బవం. భారత్
  • జూలై 18 కాశ్మీర్ లో యుద్ధ విరమణ. భారత్
  • జూలై 18 భారత రాజ్యాంగము చట్టబద్ధమయింది. భారత్
  • జూలై 21 అమెరికన్ సెనేట్ నార్త్ అట్లాంటిక్ సంధిని (నాటో)ని 82-13 ఓట్లతో రద్దు చేసింది.
  • ఆగస్టు 15 దేశభక్త కొండా వెంకటప్పయ్య దేశ స్వాతంత్ర్య పుణ్యదినాన స్వర్గస్థులయ్యారు.
  • ఆగస్టు 29 సోవియట్ యూనియన్ తన మొట్ట మొదటి అణుబాంబును (పేరు : ఫస్ట్ లైట్నింగ్ (లేక) జోయ్ 1) కజకిస్తాన్ లోని సెమిపలతిస్‌స్క్ అనే చోట పరీక్షించింది.
  • సెప్టెంబరు 14 భారత రాజ్యాంగంలోని 351 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని జాతీయభాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. భారత్
  • అక్టోబరు 1 'మరాఠీ రంగభూమి' అనే నాటక సంస్థ స్థాపించబడింది.
  • అక్టోబరు 15 బనారస్ సంస్థానం, త్రిపుర, మణిపూర్‌ భారత్‌లో విలీనమయ్యాయి. భారత్
  • అక్టోబరు 17 జమ్ము, కాశ్మీర్‌ లకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 వ నిబంధనను చట్టసభలు స్వీకరించాయి. భారత్
  • నవంబరు 24 మన దేశం చిత్రం ద్వారా ఎల్.వి.ప్రసాద్ తన దర్శకత్వంలో ఎన్.టి.రామారావును చిన్న పాత్రలో సినీరంగానికి పరిచయం చేశారు.
  • నవంబరు 26 1949 నవంబరు 26 లో రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ రచనను పూర్తిచేసింది.
  • నవంబరు 26 రాజ్యాంగ పరిషత్ స్వతంత్ర భారత రాజ్యాంగ రచనను పూర్తి చేసింది. భారత్

జననాలు

  • జనవరి 10 అల్లు అరవింద్, భారత చలన చిత్ర నిర్మాత. భారత్
  • జనవరి 12 గుండప్ప విశ్వనాథ్, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. భారత్
  • జనవరి 13 రాకేష్ శర్మ, అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు. భారత్
  • జనవరి 31 గద్దర్,గాయకుడు, ప్రజా ఉద్యమం నేత(మ.2023).
  • ఫిబ్రవరి 7 పి.సుదర్శన్ రెడ్డి.
  • ఫిబ్రవరి 14 రిచర్డ్ నీల్, అమెరికన్ రాజకీయ నాయకుడు.
  • ఫిబ్రవరి 15 నామ్‌దేవ్ ధసల్ మరాఠీ కవి, రచయిత. దళిత్ పాంథర్స్ వ్యవస్థాపకుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2014).
  • ఏప్రిల్ 23 అక్కిరాజు సుందర రామకృష్ణ, రంగస్థల సినిమా నటుడు, గాయకుడు, అధ్యాపకుడు, మంచి వక్త.
  • మే 1 ఐ.వి.యస్. అచ్యుతవల్లి, 18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.
  • మే 18 నరాల రామిరెడ్డి, సుప్రసిద్ధ తెలుగు అవధానీ.
  • మే 26 వార్డ్ కన్నింగ్‌హమ్, మొట్టమొదట వికీపీడియాను అభివృద్ధి చేసిన అమెరికన్ కంప్యూటర్ ప్రోగ్రామర్.
  • జూన్ 9 కిరణ్‌ బేడీ, భారత దేశ మహిళా పోలీసు అధికారి, సామాజిక కార్యకర్త. భారత్
  • జూన్ 16 విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, రాజమండ్రికి చెందిన సంస్కృత పండితుడు.
  • జూన్ 17 విజయలలిత, తెలుగు సినీనటి, శృంగార నాట్యతార, నిర్మాత.
  • జూలై 1 వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి, భారతీయ జనతా పార్టీ నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు. భారత్
  • జూలై 1 సురభి బాబ్జీ, సురభి నాటక నిర్వాహకుడు (మ. 2022).
  • జూలై 3 అనుమాండ్ల భూమయ్య, తెలుగు కవి.
  • జూలై 8 వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (మ.2009).
  • జూలై 10 సునీల్ గవాస్కర్, "లిటిల్ మాస్టర్"గా పేరొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
  • జూలై 17 రంగనాథ్, విలక్షణమైన తెలుగు సినిమా నటుడు, కవి. (మ.2015).
  • జూలై 18 డెన్నిస్ లిల్లీ, ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
  • జూలై 23 కోడి రామకృష్ణ , తెలుగు చలనచిత్ర దర్శకుడు (మ.2019).
  • ఆగస్టు 1 గల్లా అరుణకుమారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి.
  • ఆగస్టు 1 దుర్గెంపూడి చంద్రశేఖరరెడ్డి, విమర్శకుడు, భాషాశాస్త్ర పండితుడు, ఎమెస్కో గౌరవ సంపాదకుడు.
  • ఆగస్టు 2 బెర్టలాన్ ఫర్కాస్, రోదసీలో ప్రయాణించిన మొదటి హంగరీ దేశస్థుడు. (సోయుజ్36 వ్యోమ నౌక).
  • ఆగస్టు 11 దువ్వూరి సుబ్బారావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు, భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా (2008 - 2013) పనిచేశాడు.
  • ఆగస్టు 15 మైలవరపు గోపి, తెలుగు సినిమా రంగంలో ఒక ఉత్తమమైన భావాలున్న రచయిత. (మ.1996).
  • ఆగస్టు 15 దేవిప్రియ, పాత్రికేయుడు, కవి (మ.2020).
  • ఆగస్టు 17 తెలుగు గేయ రచయిత భువన చంద్ర.
  • ఆగస్టు 21 అహ్మద్​ పటేల్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు.
  • ఆగస్టు 23 బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
  • ఆగస్టు 28 డబ్బింగ్ జానకి, దక్షిణభారత చలన చిత్ర నటి. భారత్
  • ఆగస్టు 30 మమ్మెన్ చాండీ, భారతదేశంలో ఎముక మజ్జ మార్పిడి (బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్) రంగంలో నిష్ణాతుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. భారత్
  • ఆగస్టు 31 అమెరికా నటుడు రిచర్డ్ గేర్ జననం.
  • సెప్టెంబరు 14 కొడవటిగంటి రోహిణీప్రసాద్, సంగీతజ్ఞుడు, శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. (మ.2012).
  • సెప్టెంబరు 26 డా. దివాకర్, రోగాలకు మందులేయాల్సిన మనిషి రంగస్థలం తన నివాసమన్నాడు. నాడి పట్టుకోవలసిన వైద్యుడు నాటకాల్లో వేషాలకే ప్రాధాన్యత ఇచ్చాడు.
  • అక్టోబరు 3 జె.పి.దత్, భారతీయ చలనచిత్ర దర్శకుడు. భారత్
  • అక్టోబరు 18 ఎలిజబెత్ కురియన్ మోనా, హైదరాబాద్‌కు చెందిన ఉర్దూ గజల్ కవయిత్రి.
  • అక్టోబరు 26 ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి ప్రధాన న్యాయపతిగా పనిచేసిన నిసార్ అహ్మద్ కక్రూ జననం.
  • నవంబరు 3 అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు. భారత్
  • నవంబరు 15 మల్లాది వెంకట కృష్ణమూర్తి, తెలుగు రచయిత.
  • డిసెంబరు 16 తోట తరణి, సుమారు 100 సినిమాలకు కళా దర్శకత్వం వహించి, వాటి ప్రాచుర్యానికి తోడ్పడ్డాడు.

మరణాలు

  • జనవరి 6 చింతా వెంకట్రామయ్య, కూచిపూడికి యక్షగాన సొబగులు అద్దిన అపర నాట్య గురువు.
  • జనవరి 17 మచ్చా వీరయ్య, తెలంగాణ సాయుధ పోరాట నాయకుడు.
  • మార్చి 2 సరోజిని నాయుడు, భారత కోకిల. భారత్
  • మార్చి 30 దత్తారం హింద్లేకర్, టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున వికెట్ కీపింగ్ చేసిన క్రికెటర్. (జ.1909). భారత్
  • జూన్ 9 వంగోలు వెంకటరంగయ్య, బహుభాషా పండితుడు, న్యాయవాది, రచయిత. (జ.1867).
  • జూన్ 15 ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, మలయాళ కవి. (జ.1877).
  • ఆగస్టు 15 కొండా వెంకటప్పయ్య, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రోద్యమానికి ఆద్యుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశభక్త బిరుదాంకితుడు. (జ.1866).
  • ఆగస్టు 30 తల్లాప్రగడ విశ్వసుందరమ్మ, స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (జ.1899).
  • నవంబరు 10 ఏటుకూరి వెంకట నరసయ్య, అధ్యాపకుడు, రచయిత. (జ.1911).
  • నవంబరు 15 నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. (జ.1910). భారత్
  • నవంబరు 15 నారాయణ్ ఆప్తే, ఆర్.ఎస్.ఎస్. కార్యకర్త, గాంధీ హత్య కేసు నిందితులలో ఒకరు. భారత్

సినిమా

ఈ సంవత్సరపు ప్రస్థానాలు