ఈ రోజు విశేషం
1991 కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.1991 మార్చి 3 విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
తెలుగు నాట ఈ రోజు
- 1961 హైదరాబాదులో రవీంద్ర భారతి కళావేదిక ప్రారంభించబడింది.
- 1977 తెలుగు సినిమా.
- 1991 కళాభారతి ఆడిటోరియము విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో ప్రారంభించారు.1991 మార్చి 3 విశాఖపట్నంలో సాంస్కృతిక కార్యక్రమాలకు, సంప్రదాయ కళలకు కాణాచి అయిన కళాభారతి వ్యవస్థాపక దినోత్సవము.
సంఘటనలు
- 1502 కొలంబస్ ఇండీస్ దీవులకు తన చివరి (నాలుగవ) యాత్రను మొదలుపెట్టాడు.
- 1751 మొదటి అమెరికన్ ఆసుపత్రిని స్థాపించారు (పెన్సిల్వేనియా హాస్పిటల్).
- 1752 మొదటి అగ్నిప్రమాద భీమా పధకాన్ని అమెరికాలో మొదలు పెట్టారు (ఫిలడెల్ఫియా).
- 1772 ఆమ్స్టర్డాం థియేటర్ (రంగశాల) అగ్నిప్రమాదంలో తగులబడి, 18 మంది మరణించారు.
- 1784 టిప్పు సుల్తాను ఇంగ్లాండుతో మైసూరు శాంతి ఒప్పందం చేసుకున్నాడు.
- 1792 అమెరికన్ కెప్టెన్ రాబర్ట్ గ్రే, కొలంబియా నదిని కనుగొని, దానికి కొలంబియా అని పేరు పెట్టారు.
- 1816 అమెరికన్ బైబిల్ సొసైటీని స్థాపించారు (న్యూయార్క్ లో).
- 1833 లేడీ ఆఫ్ ది లేక్ అనే నౌక మంచుఖండాన్ని (ఐస్బెర్గ్), ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ములిగిపోయింది. 215 మంది మరణించారు.
- 1850 మొదటి సారిగా ఇటుకలతో భవనాలు కట్టడం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో మొదలైంది.
- 1858 మిన్నసోటా రాష్ట్రం, 32వ రాష్టంగా అమెరికాలో చేరింది.
- 1893 హెన్రీ డెస్గ్రేంజ్ మొదటి ప్రపంచ సైకిల్ రికార్డుని స్థాపించాడు (35.325 కి.మీ).
- 1916 ఐన్స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతం వెల్లడించాడు. (థియరీ ఆఫ్ జనరల్ రెలెటివిటీ).
- 1921 టెల్ అవివ్ మొట్టమొదటి యూదుల మునిసిపాలిటీ (నేటి ఇజ్రాయిల్ రాజధాని).
- 1928 జనరల్ ఎలెక్ట్రిక్ కంపెనీ మొదటి టెలివిజన్ కేంద్రాన్ని (టి.వి.స్టేషను) ని మొదలు పెట్టింది (న్యూయార్క్ లోని షెనెక్టాడీ లో).
- 1929 రోజువారీ టెలివిజన్ ప్రసారాలు మొదటిసారిగా ప్రసారమయ్యాయి (వారానికి 3 రాత్రులు).
- 1949 మొదటి పోలరాయిడ్ కెమెరాని 89.95 అమెరికన్ డాలర్లకు న్యూయార్క్ లో అమ్మారు.
- 1949 ఇజ్రాయిల్ 37-12 ఓట్లతో, 59వ సభ్యదేశంగా, యునైటెడ్ నేషన్స్ లో చేరింది.
- 1949 సియాం (సయాం) దేశం తన పేరుని థాయ్లాండ్గా మార్చుకున్నది.
- 1955 ఇజ్రాయిల్ గాజా మీద దాడి చేసింది.
- 1958 అమెరికా బికినీ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
- 1962 అమెరికా క్రిస్ట్మస్ దీవి లో, వాతావరణంలో, అణుబాంబుని పేల్చి, ఆ అణుబాంబు శక్తి, సామర్ధ్యాలని పరీక్షించింది.
- 1965 భారతదేశంలో, 1965 లో, ఒక్క నెలలోపే వచ్చిన 2 తుఫానులలో, మొదటి తుఫానుకి 35,000 మంది మరణించారు. భారత్
- 1967 అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు).
- 2000 భారతదేశ జనాభా 100 కోట్లకు చేరింది. భారత్
జననాలు
- 1895 జిడ్డు కృష్ణమూర్తి, భారతదేశపు తత్త్వవేత్త (సాంగ్స్ ఆఫ్ లైఫ్). భారత్
- 1918 మృణాళినీ సారాభాయి, శాస్త్రీయ నృత్య కళాకారిణి (మ.2016).
- 1922 మాధవపెద్ది సత్యం, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, సింహళ భాషలతో సహా దాదాపు అన్ని భారతీయ భాషలలో 7,000 పైగా పాటలు పాడి ప్రసిద్ధి చెందాడు.
- 1925 వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, రంగస్థల నటుడు, బాలనాగమ్మలో ఫకీరుగానూ, రామాంజనేయ యుద్ధంలో యయాతిగానూ, సక్కుబాయిలో శ్రీకృష్ణుడుగానూ, సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడిగా నటించారు.
- 1928 సామల సదాశివ, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (మ.2012).
- 1940 భాస్కర్ శివాల్కర్ హైదరాబాదుకు చెందిన నాటకరంగ ప్రముఖుడు. (మ.2023).
- 1970 పూజా బేడీ , సినీనటి , టెలివిజన్ వ్యాఖ్యాత.
- 1980 పోసాని సుధీర్ బాబు, తెలుగు సినిమా నటుడు. తెలుగు నటుడు ఘట్టమనేని కృష్ణ చిన్నల్లుడు.
- 1982 సత్య కృష్ణన్ , ప్రముఖ సినీ నటి.
- 1992 ఆదాశర్మ , భారతీయ సినీ నటీ. భారత్
- 1993 రాజ్ తరుణ్ , తెలుగు చిత్ర నటుడు, రచయిత.
మరణాలు
- 1873 మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి, మాడుగుల సంస్థాన ప్రభువైన శ్రీకృష్ణ భూపాలుని ఆస్థానంలో కవి, పండితుడు.
- 1992 పుష్పవల్లి , అలనాటి తెలుగు చలన చిత్ర నటి,(హిందీ నటి రేఖ తల్లి), జ.1926.
- 1994 సర్దేశాయి తిరుమలరావు, తైల పరిశోధనా శాస్ర్తవేత్త, సాహితీ విమర్శకుడు. (జ.1928).
- 2017 సి.ఆర్.ఎం.పట్నాయక్ వంశధార ప్రాజెక్టును డిజైన్ చేసిన ఇంజనీరు.
సినిమా
- 1973 'కన్నకొడుకు' చిత్రం విడుదలైంది.
పండుగలు, జాతీయ దినాలు
- జాతీయ సాంకేతిక దినోత్సవం.
- ప్రపంచ అహంకార అవగాహన దినోత్సవం.