ఫిబ్రవరి 24 ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ని, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ ఆక్రమించగా, అమెరికా విడిపించిన్ రోజు.
మే 2 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న సమయంలో, రష్యన్ సైన్యం, బెర్లిన్ని జయించింది.
మే 5 డెన్మార్క్, నాజీ కబందహస్తాలనుంచి, విడుదలైంది.
జూలై 16 "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టారు.
జూలై 16 మిత్రదేశాల నాయకులు విన్స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.
ఆగస్టు 2 రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి, పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు.
ఆగస్టు 6 హిరొషిమా మీద బాంబ్ ప్రయోగించబడింది. 1945 ఆగష్టు 6 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్నిక్షనాలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్ఫోటనంలో, 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ, మూడవ రోజు, అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం లో, అమెరికాకు, లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే, అతి ఖరీదైన యుద్ధం గా, మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా, యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
ఆగస్టు 9 ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
ఆగస్టు 10 జపాన్ చక్రవర్తి హిరోహితో యొక్క హోదా, యధాతధంగా ఉంచితే, జపాన్, మిత్రరాజ్యాలకు లొంగిపోవటానికి, తన సుముఖతను, ప్రకటించింది.
ఆగస్టు 15 కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.
ఆగస్టు 18 ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్మోసాలో విమాన ప్రమాద గాయాలతో మరణించారు.
భారత్
ఆగస్టు 25 వరంగల్లు జిల్లా బైరాన్పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
ఆగస్టు 30 బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
భారత్
ఆగస్టు 30 జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.