ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • ఫిబ్రవరి 24 ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా ని, రెండవ ప్రపంచ యుద్దంలో జపాన్ ఆక్రమించగా, అమెరికా విడిపించిన్ రోజు.
  • మే 2 రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోతున్న సమయంలో, రష్యన్ సైన్యం, బెర్లిన్ని జయించింది.
  • మే 5 డెన్మార్క్, నాజీ కబందహస్తాలనుంచి, విడుదలైంది.
  • జూలై 16 "ఫేట్ బాయ్" అని ముద్దు పేరున్న మొదటి ప్లుటొనియం అణుబాంబును (ప్రయోగాత్మకంగా) ఉదయం 5:30 గంటలకు అమెరికా అలమొగొర్డొ ఎయిర్ బేస్ (న్యూమెక్సికో ఎడారి ప్రాంతం) పరీక్షించింది. అణుబాంబు పేలిన తర్వాత ఏర్పడిన పుట్టగొడుగు మేఘాలు 41,000 అడుగుల ఎత్తువరకు వ్యాపించాయి. దాని ఫలితంగా, ఒక మైలు వ్యాసార్ధం (రేడియస్) లో ఉన్న జీవజాతులన్నీ మరణించాయి. ఈ రోజునుంచి "అణు యుగం" ప్రారంభమయ్యింది. ఈ అణుబాంబు తయారీ, ప్రయోగం అంతటినీ "మన్‌హట్టన్ ప్రాజెక్టు"గా పేరు పెట్టారు.
  • జూలై 16 మిత్రదేశాల నాయకులు విన్‌స్టన్ చర్చిల్, హేరీ ఎస్. ట్రూమన్, జోసెఫ్ స్టాలిన్, రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జర్మనీ భవిష్యత్తు గురించి చర్చించటానికి సమావేశమయ్యారు.
  • ఆగస్టు 2 రెండవ ప్రపంచ యుద్ధం: మిత్ర రాజ్యాలు ఓడిపోయిన జర్మనీ యొక్క భవిష్యత్తు చర్చించడానికి, పోట్స్ డామ్ సమావేశం జరిపి, ఒక నిర్ణయం తీసుకున్నారు.
  • ఆగస్టు 6 హిరొషిమా మీద బాంబ్ ప్రయోగించబడింది. 1945 ఆగష్టు 6 న 'ఎనొల గే' అనే అమేరికా బి-29 బాంబర్ (బాంబులను ప్రయోగించడానికి వాడే విమానం), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని, హిరోషిమా పట్టణం పైన విడిచింది. ప్రపంచ చరిత్రలో, అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్నిక్షనాలోనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్ఫోటనంలో, 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ, మూడవ రోజు, అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన, నాగసాకి పై, అటువంటిదే, మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధం లో, అమెరికాకు, లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే, అతి ఖరీదైన యుద్ధం గా, మిగిలి పోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించ బడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పోయింది. 1945 ఆఖరికి 2 లక్షల మందికి పైగా, యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించ గలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
  • ఆగస్టు 9 ఆగష్టు 6 న 'ఎనొలా గే' అనే అమెరికా బి-29 బాంబర్ ( బాంబులను ప్రయోగించడానికి వాడేది ), మొదటి సారి ఒక అణ్వాయుధాన్ని జపాన్ లోని హిరోషిమా పట్టణంపైన విడిచింది. ప్రపంచ చరిత్రలో అణ్వాయుధాన్ని ఒక దేశం పై ప్రయోగించడం అదే ప్రథమం. ప్రయోగించిన కొద్ది నిముషాల్లొనే మహా విస్పొటనం సంభవించింది. దీని నుంచి వెలువడిన అగ్ని క్షణాల్లొనే పట్టణం అంతా వ్యాపించి భస్మం చేసింది. ఈ విస్పొటనంలో 70, 000 అక్కడికక్కడే మరణించారు. అంటే ఈ సంఖ్య హిరోషిమా పట్టణ జనాభాలో మూడవ వంతు. మళ్ళీ మూడవ రోజున 1945 ఆగష్టు 9 అతి పెద్ద తీరప్రాంత పట్టణమైన నాగసాకి పై అటువంటిదే మరో అణ్వాయుధాన్ని అమెరికా ప్రయోగించింది. దీనితో జపాన్ రెండవ ప్రపంచ యుద్దంలో అమెరికాకు లొంగి పోక తప్పలేదు. ఇది ప్రపంచ చరిత్ర లోనే అతి ఖరీదైన యుద్దంగా మిగిలిపోయింది. రెండు పట్టణాలు మరల నిర్మించబడ్డాయి, కాని, మానవ చరిత్రలో మరిచి పోలేని పీడ కలగా ఈ సంఘటన మిగిలి పొయింది. 1945 ఆఖరికి 2 లక్షల మంది పైగా యుద్దబాధితులుగా మిగిలారు. వీరిలో చాలామంది జీవించగలిగినా, తరువాత చాలా వ్యాధులకు గురయ్యారు.
  • ఆగస్టు 10 జపాన్ చక్రవర్తి హిరోహితో యొక్క హోదా, యధాతధంగా ఉంచితే, జపాన్, మిత్రరాజ్యాలకు లొంగిపోవటానికి, తన సుముఖతను, ప్రకటించింది.
  • ఆగస్టు 15 కొరియా తనంతట తానే, ఒక గణతంత్రదేశంగా ప్రకటించుకుంది.
  • ఆగస్టు 18 ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఫార్మోసాలో విమాన ప్రమాద గాయాలతో మరణించారు. భారత్
  • ఆగస్టు 25 వరంగల్లు జిల్లా బైరాన్‌పల్లి పై, పోలీసులు, మిలటరీ సాయంతో, భువనగిరి డిప్యూటీ కలెక్టరు ఇక్బాల్ హుస్సేన్ నాయకత్వంలో 500 మందికి పైగా రజాకార్లు దాడి చేసారు. హైదరాబాద్ సంస్థానం మిలిటరీ 84 మందిని నిలబెట్టి కాల్చి చంపింది. ప్రక్కనే ఉన్న కూటికల్లు గ్రామంపై కూడా దాడి చేసారు.
  • ఆగస్టు 30 బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది. భారత్
  • ఆగస్టు 30 జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
  • అక్టోబరు 16 ఆహార, వ్యసాయ సంస్థ ప్రారంభించబడింది.
  • అక్టోబరు 24 ఐక్యరాజ్య సమితి స్థాపన.

జననాలు

  • జనవరి 4 ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.
  • జనవరి 6 జయంతి, దక్షిణ భారత సినిమా నటి. (మ. 2021). భారత్
  • జనవరి 17 మడిపల్లి భద్రయ్య, తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు.
  • ఫిబ్రవరి 1 బొజ్జి రాజారాం, కొంకణ్ రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, వేలాడే రైలు స్కైబస్ రూపకర్త.
  • ఫిబ్రవరి 21 సుధీర్ నాయక్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
  • మార్చి 10 మాధవరావు సింధియా, కేంద్ర మాజీ మంత్రి.
  • మార్చి 22 శీల రవిచంద్రన్, కేరళ కు చెందిన నటి,దర్శకురాలు, రచయిత్రి,పలు తెలుగు చిత్రాల నటి.
  • ఏప్రిల్ 1 సర్వేశ్వర్ సహారియా భారతీయ నెఫ్రాలజిస్టు, అవయవ మార్పిడి నిపుణుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్
  • ఏప్రిల్ 24 లారీ టెస్లర్, న్యూయార్క్ కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త. (మ.2020).
  • మే 12 కె. జి. బాలకృష్ణన్, భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి. భారత్
  • మే 17 బి.ఎస్. చంద్రశేఖర్, భారత క్రికెటర్. భారత్
  • మే 26 విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త. (మ.2012). భారత్
  • జూన్ 19 నోబెల్ శాంతి గ్రహీత అంగ్ సాన్ సూకీ జననం.
  • జూన్ 20 అంగ్ సాన్ సూకీ, నోబెల్ శాంతి గ్రహీత.
  • జూన్ 22 గణేష్ పాత్రో, నాటక, సినీ రచయిత. (మ.2015).
  • జూన్ 25 శారద, దక్షిణ భారత సినీ నటి. భారత్
  • జూలై 1 విసు, తమిళ దర్శకుడు,రచయిత, నటుడు,(మ.2020). భారత్
  • జూలై 1 అడిగోపుల వెంకటరత్నం, కవి,రచయిత, నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీర్(మ.2024).
  • జూలై 2 ఎస్.ఏ.చంద్రశేఖర్ , తమిళ, తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.
  • జూలై 10 కోట శ్రీనివాసరావు, తెలుగు సినిమా నటుడు(మ.2025).
  • జూలై 30 దేవదాస్ కనకాల, నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు. (మ.2019).
  • ఆగస్టు 8 నంద్యాల వరదరాజులరెడ్డి, ప్రొద్దుటూరుకు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.
  • ఆగస్టు 10 దేవబత్తుల జార్జి, తెలుగు నాటకరంగ, సినిమా నటుడు, నాటక దర్శకుడు. (మ. 2021).
  • ఆగస్టు 15 రాళ్లపల్లి వెంకట నరసింహ రావు, తెలుగు చలనచిత్ర నటుడు(మ.2019).
  • ఆగస్టు 24 అమెరికాకు చెందిన చలనచిత్ర నిర్మాత విన్స్ మెక్‌మాన్‌.
  • సెప్టెంబరు 1 గుళ్ళపల్లి నాగేశ్వరరావు, నేత్రవైద్య నిపుణుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత.
  • సెప్టెంబరు 16 పసుపులేటి హనుమంతరావు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణ వైద్యుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
  • సెప్టెంబరు 24 డా. తిరునగరి రామానుజయ్య, సాహితీవేత్త, పద్యకవి. (మ. 2021).
  • సెప్టెంబరు 29 బాలి (చిత్రకారుడు), మంచి చిత్రకారులలో ఒకడు. ఈయన వేల సంఖ్యలో కథలకు, నవలలకు బొమ్మలు వేశాడు. ఈయన అసలు పేరు ఎం. శంకర రావు.
  • అక్టోబరు 1 రామ్ నాథ్ కోవింద్, 14వ భారత రాష్ట్రపతి. భారత్
  • అక్టోబరు 7 అట్లూరి సత్యనాథం, కాంప్యుటేషనల్ ఇంజనీరింగ్ (సంగణక సాంకేతిక శాస్త్రం) లో విశిష్టాచార్యునిగా పనిచేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి.
  • అక్టోబరు 9 అంజద్ అలీఖాన్, భారతీయ సరోద్ విద్వాంసుడు. భారత్
  • అక్టోబరు 9 విజయ కుమారతుంగా, శ్రీలంక సినీ నటుడు, రాజకీయ నాయకుడు. (మ.1988).
  • అక్టోబరు 10 జయప్రకాశ్ రెడ్డి, తెలుగు నటుడు.
  • అక్టోబరు 10 కళ్ళు చిదంబరం, తెలుగు హాస్య నటుడు. (మ.2015).
  • అక్టోబరు 12 పంతుల జోగారావు, వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
  • నవంబరు 18 మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు.
  • నవంబరు 29 బాలి, చిత్రకారుడు.
  • నవంబరు 30 వాణీ జయరాం, గాయని.
  • డిసెంబరు 4 ఇంద్రగంటి జానకీబాల, నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.
  • డిసెంబరు 12 నూతన్ ప్రసాద్, తెలుగు సినిమా రంగములోని హాస్యనటుడు, ప్రతినాయకుడు. (మ.2011).
  • డిసెంబరు 15 విను చక్రవర్తి, తమిళ హాస్యనటుడు, సినీ రచయిత, దర్శకుడు (మ.2017). భారత్
  • డిసెంబరు 28 నేపాల్ - బీరేంద్ర, రాజు.

మరణాలు

  • జనవరి 2 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864).
  • జనవరి 17 లారీ డునింగ్టన్-గ్రబ్.
  • మార్చి 5 గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి, శతావధాని.
  • మార్చి 17 సత్తిరాజు సీతారామయ్య, దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864).
  • ఏప్రిల్ 12 ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్డ్, అమెరికా 32 వ అధ్యక్షుడు . (జ. 1882).
  • ఏప్రిల్ 28 ముస్సోలినీ, ఇటలీకి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883).
  • ఏప్రిల్ 30 అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ నియంత (జ.1889).
  • మే 1 హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది.
  • మే 23 హైన్రిచ్ హిమ్లెర్, ఒక సైనిక కమాండర్, నాజీ పార్టీలో సభ్యుడు. (జ.1900).
  • ఆగస్టు 10 రాబర్ట్ గొడ్డార్డ్, అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882).
  • ఆగస్టు 11 త్యాగబీర్ హేమ్ బారువా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త, రచయిత (జ.1893). భారత్
  • ఆగస్టు 12 జి.ఎస్.అరండేల్, దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణ కార్యదర్శి (జ.1878).
  • ఆగస్టు 18 సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897). భారత్

ఈ సంవత్సరపు ప్రస్థానాలు