జనవరి 13 సంక్రాంతికి విడుదలైన చిరంజీవి చిత్రం వాల్తేరు వీరయ్య ఘన విజయం సాధించింది.
జనవరి 27 ప్రఖ్యాత నటి జమున హైదరాబాదులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
ఫిబ్రవరి 1 2023-24 ఆర్థిక సంవత్సారానికి భారత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
భారత్
ఫిబ్రవరి 2 శంకరాభరణం సృష్టికర్త, దర్శకుడు కె. విశ్వనాథ్ హైదరాబాదులో శివైక్యం చెందారు.
ఫిబ్రవరి 6 ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రావిన్స్లో 7.8 (Mww) భూకంపం సంభవించింది. సమీపంలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్లో అదే రోజున 7.5 Mww ఆఫ్టర్షాక్ ఏర్పడింది. టర్కీ, సిరియాలలో అధిక నష్టం జరుగగా 34,800 మందికి పైగా మరణించారు, 87,000 మందికిపైగా గాయపడ్డారు.
ఫిబ్రవరి 6 తెలంగాణ శాసనసభ సమావేశాలలో 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
ఫిబ్రవరి 11 హైదరాబాదులోని హుసేన్ సాగర్ తీరాన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫార్ములా ఈ రేసు నిర్వహించబడింది. ఈ రేసులో జీన్ ఎరిక్ విన్నర్గా, రెండో స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమీ నిలిచారు.
ఫిబ్రవరి 19 కె. విశ్వనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన విశ్వదర్శనం చిత్రం ఆయన 93వ జయంతి నాడు ఈటీవీలో ప్రసారమైంది.
మార్చి 13 జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ గెలుచుకుంది.
మార్చి 13 ఎం.ఎం.కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
మార్చి 13 రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ గెలుచుకుంది.
మార్చి 13 రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.
ఏప్రిల్ 14 తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంక్బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతివనంలో నిర్మించిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించాడు.
ఏప్రిల్ 30 హైదరాబాదులోని ట్యాంక్బండ్ సమీపంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ను ముఖ్యముంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించాడు.
జూన్ 2 ఒడిశాలో రైలు ఢీకొన్న ప్రమాదంలో కనీసం 288 మంది మరణించారు, 1,000 మంది గాయపడ్డారు.
భారత్
జూన్ 2 తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి.
జూన్ 20 రామ్ చరణ్, ఉపాసన దంపతులకు తొలి సంతానంగా కుమార్తె క్లిన్ కార జన్మించింది.
జూన్ 22 తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభించబడింది.
ఆగస్టు 15 చంద్రబాబునాయుడు విశాఖపట్నంలో ఇండియా@2047 విజన్ పత్రాన్ని ఆవిష్కరించారు.
ఆగస్టు 22 ఆంధ్రప్రదేశ్ విభజనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు కేసు లిస్ట్ అయింది.
ఆగస్టు 23 ఇస్రో చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసి ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ను నిలిపింది.
భారత్
ఆగస్టు 28 ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రూ.100 స్మారక నాణేన్ని విడుదల చేశారు.
భారత్
సెప్టెంబరు 2 సౌర కరోనా అధ్యయనం కోసం ఇస్రో తన తొలి సౌర యాత్ర ఆదిత్య-ఎల్1ను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించింది.
భారత్
సెప్టెంబరు 9 స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబునాయుడును సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్టు చేశారు.
సెప్టెంబరు 21 మహమ్మద్ అజారుద్దీన్ న్యూఢిల్లీలోని జామియా హమ్దర్ద్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
అక్టోబరు 31 52 రోజుల జ్యుడీషియల్ కస్టడీ అనంతరం చంద్రబాబునాయుడు బెయిల్పై విడుదలయ్యారు.
నవంబరు 17 మల్లికార్జున ఖర్గే సమక్షంలో విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
డిసెంబరు 3 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కేసీఆర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.
డిసెంబరు 16 కేసీఆర్ తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు.
మరణాలు
జనవరి 2 ఎం. శ్రీధర్ రెడ్డి, రాజకీయ నాయకుడు, కవి, రచయిత (జ. 1945).
జనవరి 5 రేగులపాటి కిషన్ రావు, కవి, నవల రచయిత (జ. 1946).