ఈ రోజు విశేషం
1947 ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.
తెలుగు నాట ఈ రోజు
- 1922 జలగం వెంగళరావు శ్రీకాకుళం జిల్లా సోపేరు గ్రామంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
- 1947 ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు. పూర్తి ప్రస్థానం →
సంఘటనలు
- 1979 ఇంగ్లాండ్ ఎన్నికలలో మార్గరెట్ థాచర్ ఘన విజయం.
- 1989 అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ [http://en.wikipedia.org/wiki/Magellan_(spacecraft)] అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.
జననాలు
- 1767 త్యాగరాజు, (త్యాగయ్య, త్యాగబ్రహ్మ). నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. (మ. 1847).
- 1911 ఎస్.వి.ఎల్.నరసింహారావు, న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు, బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. భారత్
- 1934 అక్కిరాజు రమాపతిరావు, పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
- 1947 దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017).
- 1950 కొనకళ్ళ నారాయణరావు, మచిలీపట్నం లోక్ సభ సభ్యులుగా ఎన్నికైనారు.
- 1951 నారమల్లి శివప్రసాద్, తెలుగు సినిమా నటుడు, తెలుగుదేశం నాయకుడు.(2019).
- 1955 అంజు చధా, భారతీయ జీవరసాయన శాస్త్రవేత్త. భారత్
- 1960 డి. కె. అరుణ, ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గంలో చిన్నతరహా పరిశ్రమల శాఖామంత్రిగా పనిచేసింది.
- 1983 త్రిష , తెలుగు,తమిళ, చిత్రాల సినీనటి.
మరణాలు
- 1799 టిప్పు సుల్తాన్, మైసూరు రాజు. (జ.1750).
- 1979 గుడిపాటి వెంకట చలం, రచయిత. (జ. 1894).
పండుగలు, జాతీయ దినాలు
- అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం.
- వరల్డ్ గివ్ ( give ) డే.
- బొగ్గు గని కార్మిక దినోత్సవం.