ఫిబ్రవరి 24 సెంట్రల్ ఎక్సైజ్ వ్యవస్థాపక దినోత్సవము. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ శాఖను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది (సి.ఇ.సి.డి).సెంట్రల్ బోర్డు ఆఫ్ ఎక్సైజ్ అంద్ కస్టమ్స్ (సి.బి.ఇ.సి) చూడు.
భారత్
ఏప్రిల్ 21 ఫ్రాన్సులో మహిళలు వోటు వేయడానికి అర్హత పొందారు.
మే 19 అడాల్ఫ్ హిట్లర్ పై, అతని స్వంత అధికారులు చేసిన హత్యాయత్నం విఫలమైంది.
జూన్ 17 ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
జూలై 20 రాస్తెన్ బర్గ్ లో జరిగిన మూడవ హత్యా ప్రయత్నం నుంచి, అడాల్ఫ్ హిట్లర్ తప్పించుకున్నాడు.
జూలై 21 జపాన్ ఆక్రమించిన 'గువామ్' అనే ప్రాంతాన్ని, అమెరికన్ దళాలు విడిపించాయి. (రెండవ ప్రపంచ యుద్ధం).
ఆగస్టు 4 ఆమ్స్టర్ డాంలో దాగి ఉన్న అన్నే ఫ్రాంక్ అనే 15 సంవత్సరాల బాలికను, ఆమె కుటుంబాన్ని, నాజీలు ఖైదు చేసారు. ఈ బాలిక రాసిన అన్నే ఫ్రాంక్ డైరీ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, యూదులు అనుభవించిన నరక యాతనకు ప్రతిబింబం ఈ డైరీ (దినచర్య పుస్తకం).
ఆగస్టు 15 ఫ్రాన్స్ దక్షిణాన, మిత్ర దేశాల దళాలు దిగి, మార్సీల్స్ పట్టణాన్ని, తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
ఆగస్టు 19 రెండవ ప్రపంచ యుద్ధము: పారిస్ విమోచన. మిత్రదళాల సహాయంతో, జర్మనీ ఆక్రమణ నుంచి పారిస్ కి విమోచనం కలిగింది.
ఆగస్టు 29 స్లొవేకియాలోని స్లొవాక్ దళాలు 60, 000 మంది నాజీలకు వ్యతిరేంగా ఉద్యమింఛటంతో స్లొవాక్ లో జాతీయతా భావం ఉప్పొంగింది. ఆనాటినుంచి, 29 ఆగస్టుని జాతీయతా భావం ఉప్పొంగిన దినంగా జరుపుకుంటున్నారు స్లొవేకియా లో.
జననాలు
ఫిబ్రవరి 15 పొన్నాల లక్ష్మయ్య, 4 ముఖ్యమంత్రుల హయంలో రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. 2014, మార్చి 11న తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులుగా నియమితులైనారు.
ఫిబ్రవరి 15 రావులపల్లి గుర్నాథరెడ్డి, 5సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు.
ఫిబ్రవరి 28 రవీంద్ర జైన్, సంగీత దర్శకుడు (మ.2015).
జూన్ 1 జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త.
జూన్ 4 కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకులు. (మ.2003).
జూన్ 11 మేకపాటి రాజమోహన రెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ లోని నరసారావుపేట లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
అక్టోబరు 30 బీరం మస్తాన్రావు, రంగస్థల కళాకారుడు, నట శిక్షకుడు, తెలుగు సినిమా దర్శకులు. (మ.2014).
నవంబరు 1 వనమా వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, మాజీ వైద్య విధాన పరిషత్ మంత్రి కొత్తగూడెం ఎమ్మెల్యే.
నవంబరు 4 పద్మావతి బందోపాధ్యాయ, భారత వైమానిక దళంలో మొదటి మహిళా ఎయిర్ మార్షల్. ఆమె భారత సాయుధ దళాలలో మూడు నక్షత్రాల ర్యాంకుకు పదోన్నతి పొందిన రెండవ మహిళ.
భారత్
డిసెంబరు 1 డి.ఎస్.ఎన్. మూర్తి, రంగస్థల నటుడు, దర్శకుడు, అభినయ అధ్యాపకుడు.
డిసెంబరు 30 అంజనా భౌమిక్, బెంగాలీ సినిమానటి.(మ.2024).
మరణాలు
ఫిబ్రవరి 16 దాదాసాహెబ్ ఫాల్కే, భారతీయ చలనచిత్ర పితామహులు. (జ.1870).
భారత్