జనవరి 17 మొదటిసారి ఒక భారతీయుడు - కల్నల్ జె.కె.బజాజ్ - దక్షిణ ధృవాన్ని చేరుకున్నాడు.
భారత్
మే 4 అమెరికా అంటే నాసా 1989 మే 4 తేదీన, పంపిన మాగెల్లాన్ అనే రోదసీ నౌక 15 నెలలు భూమి నుంచి ప్రయాణించి, శుక్రగ్రహం మీద నెమ్మదిగా దిగి, అక్కడి శుక్రగ్రహం నేలను, పర్వతాలను, గోతులను, పటాలుగా (మేప్) తయారుచేయటం మొదలుపెట్టింది. ఆ నౌక శుక్రగ్రహం మీద కొన్ని సంవత్సరాలు ఉంటుంది. భూగ్రహం మీద 8 నెలలు అయితే, అక్కడ ఒక రోజు అవుతుంది. శాస్త్రవేత్తలు, శుక్రగ్రహంని నరకద్వారం లేదా పాతాళలోకం అంటారు ఎందుకంటే ఆ గ్రహం నివసించటానికి పనికిరాదు.
మే 14 ఛైనా లోని 'తియాన్మెన్ స్వేర్' లో 'ప్రజాస్వామ్యహక్కుల' కోసం ప్రదర్శన జరిగింది.
మే 15 గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
మే 20 చైనీస్ ప్రీమియర్ లి, తియాన్మెన్ స్క్వేర్లో ఉధృతమైన విద్యార్థి ప్రదర్శనలకు, ప్రతిస్పందనగా బీజింగ్లో యుద్ధ చట్టం (మార్షల్ లా) ప్రకటించాడు.
జూన్ 19 ఇ.ఎస్. వెంకట రామయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా ప్రమాణస్వీకారం (1989 జూన్ 19 నుంచి 1989 డిసెంబరు 18 వరకు).
భారత్
జూలై 20 బర్మాను పాలిస్తున్న సైనికా జుంటా ప్రభుత్వము, ప్రతిపక్ష నాయకురాలు 'దా అంగ్ సాన్ సూ క్యి' ని గృహ నిర్బంధం (ఇంటిలో నుంచి బయటకు రాకుండా) లో ఉంచారు.
సెప్టెంబరు 27 భారతదేశ మొదటి ఐ ఆర్ బి ఎమ్, ఒరిస్సా నుండి పృథ్విని రెండవసారి విజయవంతంగా ప్రయోగించారు.
భారత్
అక్టోబరు 29 విజయవాడలో మొదటి పుస్తక ప్రదర్శన నిర్వహించారు.
నవంబరు 5 అంతర్జాతీయ ఒకరోజు క్రికెట్ పోటీల్లో బ్యాట్స్మన్గా సచిన్ టెండూల్కర్ అరంగేట్రం.
నవంబరు 9 1961 ఆగస్టు 13 తేదీన బెర్లిన్, ఈస్ట్ జర్మనీగా విభజించబడింది. బ్రన్దేన్బుర్గ్ గేట్ మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, బెర్లిన్ వాల్ గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ బెర్లిన్ వాల్ ఒక అడ్డంకిగా నిలిచింది.
డిసెంబరు 2 భారత ప్రధానమంత్రిగా వి.పి.సింగ్ నియమితుడైనాడు.
భారత్
డిసెంబరు 18 భారత లోక్సభ స్పీకర్గా బలరాం జక్కర్ పదవీ విరమణ.
భారత్
డిసెంబరు 24 ఎస్సెల్ వరల్డ్ ముంబయిలో ప్రారంభమైంది.
జననాలు
జనవరి 3 సైందవి , నేపథ్య గాయని, భారతీయకర్ణాటక సంగీత గాయకురాలు.
భారత్
జనవరి 5 పందుల సునీల్, అమీనాపురం, కేసముద్రం మండలం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ.
జనవరి 6 హెబ్బా పటేల్, భారతీయ చలనచిత్ర నటీమణి.
భారత్
జనవరి 7 పార్వతీ మెల్టన్ , తెలుగు, భారతీయ భాషల సినీనటి.
జనవరి 10 నద్దునూరి అశోక్ స్టాలిన్, ఎ.ఐ.యస్.ఏఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు.
జనవరి 19 సుష్మా రాజ్ , కన్నడ, తెలుగు , తమిళ చిత్రాల నటి.
డిసెంబరు 13 టేలర్ స్విఫ్ట్, అమెరికా దేశపు గాయని, పాటల రచయిత, నటీమణి.
డిసెంబరు 21 తమన్నా, భారతీయ చలనచిత్ర నటి, మోడల్, నృత్య కారిణి.
భారత్
మరణాలు
జనవరి 12 చెళ్ళపిళ్ళ సత్యం, తెలుగు సినిమాలలో సంగీత దర్శకుడు (జ.1933).
జనవరి 16 ప్రేమ్ నజీర్, భారతీయ చలనచిత్ర నటుడు, రెండు గిన్నీస్ ప్రపంచ రికార్డులు పొందినవాడు . (జ.1926).
భారత్
మార్చి 1 మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్దాదా పాటిల్.
భారత్
మార్చి 5 పృథ్వీసింగ్ ఆజాద్, గదర్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892).
ఏప్రిల్ 6 పన్నాలాల్ పటేల్, గుజరాతీ భాషా రచయిత.
భారత్
ఏప్రిల్ 9 ఏ.ఎం.రాజా, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు. (జ. 1929).
ఏప్రిల్ 12 ఎక్కిరాల భరద్వాజ, ఆధ్యాత్మిక గురువు, రచయిత. (జ.1938).
ఏప్రిల్ 27 తమనపల్లి అమృతరావు, తొలినాటి నుండి మధ్యనిషేధం అమలుపై తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. 1956లో ఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి మధ్య నిషేధ కార్యకర్తల మండలికి సభ్యులయ్యారు.
భారత్