ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 6 అఖిల భారత కాంగ్రెసు కమిటీ భారత విభజనను అంగీకరించింది. విభజనకు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 52 వచ్చాయి. భారత్
  • మే 4 ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.
  • మే 29 రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రాని, అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన, ఎపిస్కోపల్ చర్చి, బిషప్గా 2003 ఆగస్టు 3 నాడు నియమించింది. ఈ నియామకానికి, ప్రపంచవ్యాప్తంగా, మత పెద్దలు నిరసనలు తెలియచేసారు. 2003 ఆగస్టు 5 లో ఈ నియామకం అంగీకరించబడింది.
  • జూన్ 3 బ్రిటీషు వైస్రాయి మౌంట్‌బాటన్ స్వాతంత్ర్యానంతరం భారతదేశంలోని స్వదేశసంస్థానాలకు సార్వభౌమత్వం తొలగించబడుతుందని ప్రకటించాడు. భారత్
  • జూన్ 3 బ్రిటిష్ ఇండియాను భారత్, పాకిస్తాన్‌లుగా విభజిస్తున్నట్లు చివరి వైస్రాయ్ మౌంట్‌బాటన్ ప్రకటించారు. భారత్
  • జూన్ 20 మొట్టమొదటి సారిగా గంటకి 600 మైళ్ళ (1004 కి.మీ) వేగంతో విమానం (ఎఫ్ – 80) ప్రయాణించింది. ఈ విమానాన్ని ఆల్బర్ట్ బోయ్ద్, అనే పైలట్, మురాక్ (కాలిఫోర్నియా) నడిపాడు.
  • జూలై 4 భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన. భారత్
  • జూలై 20 ప్రధాని యు. అంగ్ సాన్ మీద, అతని మంత్రివర్గ సభ్యులుగా ఉన్న మరొక తొమ్మిది మంది మీద, హత్యా ప్రయత్నం చేసినందుకు, బర్మా (నేటి మియన్మార్) మాజీ ప్రధాని 'యు. సా' ని, మరొక 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్
  • జూలై 20 1947 జూలై 19 న జరిగిన అభిప్రాయ సేకరణలో చాలా ఎక్కువ ఓట్లతో, వాయవ్య సరిహద్దు ప్రాంతం ప్రావిన్స్ (నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్) ప్రజలు, భారతదేశంలో కంటే, పాకిస్తాన్ లోనే చేరటానికి, తమ సమ్మతిని తెలిపారని, భారతదేశపు వైస్రాయి 1947 జూలై 20 తేదీన, చెప్పాడు. భారత్
  • జూలై 22 పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణపతాకం భారత జాతీయజెండా గా ఆమోదించబడింది. భారత్
  • జూలై 23 మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ).
  • ఆగస్టు 4 జపాన్ సుప్రీం కోర్టు (అత్యున్నత న్యాయస్థానం) ఏర్పడింది.
  • ఆగస్టు 14 భారత దేశ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడింది. భారత్
  • ఆగస్టు 15 భారత దేశానికి బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం లభించింది. భారత్
  • ఆగస్టు 15 స్వతంత్ర భారతదేశం గవర్నర్ జనరల్‌గా లూయీ మౌంట్‌బాటెన్ నియామకం. భారత్
  • ఆగస్టు 15 పాకిస్తాన్ స్థాపకుడు ముహమ్మద్ ఆలీ జిన్నా మొదటి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ గా, కరాచీలో పదవిని స్వీకరించాడు.
  • ఆగస్టు 15 సుదీర్ఘ స్వాతంత్ర్యోద్యమ ఫలితంగా బ్రిటిష్ పాలన ముగిసి భారతదేశం స్వతంత్ర దేశంగా అవతరించింది. భారత్
  • సెప్టెంబరు 2 తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాలలో శాంతి ర్యాలీ తీస్తున్న వందలాది మందిపై నిజాం రజాకార్లు విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, కొంత మందిని గ్రామాల్లో చేట్లకు కట్టివేసి చంపడం జరిగింది. ఈ సంఘటనలో 21మంది మృతిచెందగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు.
  • సెప్టెంబరు 30 పాకిస్థాన్ ఇంకా యెమన్ ఐక్యరాజ్యసమితిలో చేరాయి.
  • అక్టోబరు 20 భారత్‌ పాకిస్తాన్‌ల మధ్య మొదటి యుద్ధం మొదలైన రోజు. భారత్
  • నవంబరు 4 భారతదేశపు మొట్టమొదటి పరమ వీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు. భారత్
  • నవంబరు 8 జూనాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమయ్యింది. భారత్
  • నవంబరు 21 స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణా లు. భారత్
  • నవంబరు 29 హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందం కుదిరింది.
  • డిసెంబరు 27 నటుడు ఎస్. వి. రంగారావు తన మేనమామ కుమార్తె బడేటి లీలావతిని వివాహం చేసుకున్నారు.

జననాలు

  • జనవరి 3 సుబ్బరాయ శర్మ, తెలుగు సినిమా నటుడు,దర్శకుడు.
  • జనవరి 8 డేవిడ్ బౌవీ, ఆంగ్ల సంగీత విద్వాంసుడు, నటుడు, రికార్డ్ నిర్మాత, అరేంజర్. (మ.2016).
  • జనవరి 29 రేవూరి అనంత పద్మనాభరావు, కవి, నవలా రచయిత, వ్యాసకర్త.
  • ఫిబ్రవరి 6 కె.వి.కృష్ణకుమారి, రచయిత్రి.
  • మార్చి 12 ఆలపాటి వెంకట మోహనగుప్త, వ్యంగ్య చిత్రకారుడు.
  • మార్చి 14 మౌళి , చలన చిత్ర దర్శకుడు,నటుడు.
  • మార్చి 22 ఎడ్మ కిష్టారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. (మ. 2020).
  • ఏప్రిల్ 1 అజిత్ పాల్ సింగ్, భారత హాకీజట్టు మాజీ నాయకుడు, అర్జున అవార్డు, పద్మశ్రీ అవార్డుల గ్రహీత. భారత్
  • ఏప్రిల్ 17 జె. గీతారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ, చక్కెర, వాణిజ్యం, ఎగుమతులు శాఖల మంత్రి. ఇదివరలో సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు.
  • ఏప్రిల్ 28 గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మరిన కవి.
  • ఏప్రిల్ 28 హుమాయున్ ఆజాద్, బంగ్లాదేశ్ రచయిత.
  • మే 2 కోడెల శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సినియర్ నేత, తొలి శాసనసభాపతి.
  • మే 4 దాసరి నారాయణరావు, సినిమా దర్శకుడు, రచయిత, సినీ నిర్మాత, రాజకీయనాయకుడు. (మ.2017).
  • మే 29 రెవరెండ్ జెనె రోబిన్సన్ అనే హిజ్రా, (అమెరికా లోని ఆంగ్లికన్ శాఖకు చెందిన బిషప్).
  • జూన్ 6 సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (మ.1988).
  • జూన్ 9 గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018).
  • జూన్ 10 ఎ. గణేష మూర్తి, తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకుడు. పార్లమెంట్ సభ్యుడు. (మ.2024). భారత్
  • జూన్ 11 లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ రాజకీయ నాయకుడు. భారత్
  • జూలై 7 ఎ.మోహన్ గాంధీ , తెలుగు ,తమిళ, కన్నడ, చిత్రాల దర్శకుడు.
  • జూలై 7 జ్ఞానేంద్ర, నేపాల్ రాజు.
  • జూలై 14 గుండా మల్లేష్, కమ్యూనిస్టు నేత, శాసనసభ మాజీ సభ్యుడు. (మ.2020).
  • జూలై 20 గెర్డ్ బిన్నింగ్ ఫ్రాంక్‌ఫర్ట్, ఫిజిసిస్ట్ (టన్నెలింగ్ సూక్ష్మదర్శిని - నోబెల్ బహుమతి గ్రహీత 1986).
  • జూలై 21 చేతన్ చౌహాన్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత్
  • ఆగస్టు 7 సుత్తివేలు, తెలుగు హాస్య నటులు. (మ.2012).
  • ఆగస్టు 20 వి.రామకృష్ణ, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు. (మ.2015).
  • ఆగస్టు 20 తిలకం గోపాల్, వాలీబాల్ మాజీ ఆటగాడు, కెప్టెన్. (మ. 2012).
  • సెప్టెంబరు 1 పి.ఎ.సంగ్మా, భారతదేశ లోక్ సభ మాజీ సభాపతి. (మ.2016). భారత్
  • సెప్టెంబరు 21 స్టీఫెన్ కింగ్, కింగ్ ఆఫ్ హారర్ గా పేరుపొందిన అమెరికన్ రచయిత.
  • సెప్టెంబరు 29 మతుకుమల్లి విద్యాసాగర్, రాయల్ సొసైటీకి చెందిన ఫెలో, కంట్రోల్ ధియరిస్టు. ఆయన భారతదేశానికి చెందిన శాస్త్రవేత్త. భారత్
  • సెప్టెంబరు 29 సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (మ.2016). భారత్
  • అక్టోబరు 1 దల్వీర్ భండారీ, భారతీయ న్యాయవాది, న్యాయమూర్తి. భారత్
  • అక్టోబరు 10 ఎమ్. చంద్రసేనగౌడ్, రంగస్థల నటి.
  • అక్టోబరు 11 వడ్డే రమేష్, తెలుగు సినీ నిర్మాత. (మ.2013).
  • అక్టోబరు 21 నోరి దత్తాత్రేయుడు, భారతీయ వైద్యుడు, రేడియేషన్ ఆంకాలజిస్టు, అమెరికాలోని మెమోరియల్ స్లోన్ కేటరింగ్ ఆసుపత్రి యందు క్యాన్సర్ విభాగానికి అధికారిగా సేవచేస్తున్నాడు. భారత్
  • నవంబరు 7 ఉషా ఉతుప్, భారతీయ పాప్ గాయని , సినీనటి. భారత్
  • నవంబరు 14 దేవరకొండ విఠల్ రావు, 4 వ భారత పార్లమెంటు సభ్యుడు. భారత్
  • నవంబరు 26 మాగుంట సుబ్బరామిరెడ్డి, ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత మంచినీటి సరఫరా, ఒంగోలు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. (మ.1995).
  • డిసెంబరు 8 గంగైఅమరన్, సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు.
  • డిసెంబరు 18 ఎన్.ఎస్.ప్రకాశరావు, ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగు కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ చదివిన ప్రకాశరావు సాహిత్యంలో అత్యంత మక్కువ చూపేవాడు (మ.1973).
  • డిసెంబరు 31 కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, కవి. (మ.2009).

మరణాలు

  • ఫిబ్రవరి 12 టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (జ.1880).
  • సెప్టెంబరు 11 దువ్వూరి రామిరెడ్డి, దువ్వూరి శైలి తెలుగు సాహిత్యంలో నవోన్మేషణమై నలుదిశలా వెలుగులు ప్రసరించింది. (జ.1895).
  • సెప్టెంబరు 26 బంకుపల్లె మల్లయ్యశాస్త్రి, సంఘసంస్కర్త, రచయిత, పండితుడు (జ.1876).
  • అక్టోబరు 4 మాక్స్ ప్లాంక్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు