ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1498 కొలంబస్ ట్రినిడాడ్ దీవికి చేరుకున్నాడు.
  • 1777 మార్క్విస్ డే లాఫయెట్టె అమెరికన్ కాంటినెంటల్ సైన్యానికి మేజర్ జనరల్ అయ్యాడు.
  • 1790 మొట్టమొదటి అమెరికన్ పేటెంటును వెర్మాంట్ లోని సామ్యూల్ హాప్కిన్స్ కి ఎరువులు తయారుచేయటానికి ఇచ్చారు.
  • 1948 కలకత్తా రాష్ట్ర రవాణా వ్యవస్థ ఏర్పాటు - దేశంలో మొదటి రవాణా వ్యవస్థ /కార్పోరేషన్. భారత్
  • 1954 ఎవరెస్టు పర్వతం తరువాత ఎత్తైన గాడ్విన్-ఆస్టెన్ (కె2 అంటారు- ప్రపంచంలో రెండవ ఎత్తైన పర్వతం) ని మొదటిసారిగా, ఆర్డితటొ డిసియో నాయకత్వంలోని, ఇటలీ బృందం ఎక్కింది.
  • 1964 అమెరికా రోదసీ నౌక రేంజర్ 7 చంద్రుడి ఉపరితలం ఫొటోలు తీసి భూమికి పంపింది.
  • 2007 పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్కు ప్రతిష్ఠాత్మకమైన రామన్ మెగసెసే అవార్డు లభించింది.

జననాలు

  • 1880 ప్రేమ్‌చంద్, భారతదేశపు హిందీ,, ఉర్దూ కవి. (మ.1936). భారత్
  • 1912 మిల్టన్ ఫ్రీడ్‌మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
  • 1939 నండూరి పార్థసారథి, రాంబాబు డైరీ, సాహిత్యహింసావలోకనం గ్రంథాల రచయిత, పాత్రికేయులు. (మ.2024).
  • 1941 అమర్‌సింహ్ చౌదరి, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి (మ.2004). భారత్
  • 1944 షెర్రీ లాన్సింగ్, అమెరికన్ మాజీ ఫిల్మ్ స్టూడియో ఎగ్జిక్యూటివ్.
  • 1946 తమ్మారెడ్డి లెనిన్ బాబు , తెలుగు చలన చిత్ర దర్శకుడు.
  • 1951 శరత్ బాబు, తెలుగు సినిమా నటుడు (మ. 2023).
  • 1953 మణివన్నన్, తెలుగు, తమిళ, చలన చిత్ర దర్శకుడు, నటుడు, రచయత(మ.2013).
  • 1965 జె.కె. రౌలింగ్, ఇంగ్లీషు రచయిత.
  • 1992 కైరా అద్వానీ , భారతీయ సినీ నటీ. భారత్

మరణాలు

  • 1805 ధీరన్ చిన్నమ్మలై, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, తమిళ ఉద్యమకారుడు. (జ. 1756). భారత్
  • 1875 ఆండ్రూ జాన్సన్, 17వ అమెరిక అధ్యక్షుడు. (జ.1808).
  • 1902 పట్నం సుబ్రమణ్య అయ్యరు, శాస్త్రీయ సంగీతజ్ఞుడు (జ.1845).
  • 1980 మహమ్మద్ రఫీ, హిందీ, ఉర్దూ, మరాఠీ, తెలుగు భాషల సినిమా నేపథ్యగాయకుడు. (జ.1924).
  • 2004 అల్లు రామలింగయ్య, హాస్య నటుడు (జ.1922).
  • 2014 ముక్కురాజు, డాన్స్ మాస్టార్, ఫైటర్, నటుడు (జ.1931).

సినిమా

  • 1964 'అగ్గిపిడుగు' చిత్రం విడుదలైంది.
  • 2025 'కింగ్డమ్ (2025 సినిమా)' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • ప్రపంచ రేంజర్ దినోత్సవం.