ఏప్రిల్ 22 ప్రావ్దా (Pravda), సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ప్రచురణ ప్రారంభించబడింది.
మే 5 ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్హోమ్ లో ప్రారంభమయ్యాయి.
జూలై 1 ప్రఖ్యాత దర్శకుడు కె.వి.రెడ్డి కదిరి సమీపంలోని తేళ్ళమిట్ట పల్లెలో జన్మించారు.
జూలై 22 స్పెయిన్ లోని స్టాక్ హోమ్ లో 5వ ఒలింపిక్ గేమ్స్ పూర్తి అయ్యాయి.
ఆగస్టు 5 జపాన్ లోని టోక్యో నగరంలోని "గింజా" అనే చోట, మొట్టమొదటి సారిగా టాక్సి కేబ్ (అద్దె కారు- టాక్సీలు) లు ప్రారంభించారు.
ఆగస్టు 13 మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్, ఫిలడెల్ఫియా లోని సెయింట్ జోసెఫ్ కళాశాలకు మంజూరు చేసింది.
అక్టోబరు 14 హెచ్.సి.హెడా, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, హైదరాబాదు రాజ్యంలోని మరాఠీ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకుడు.
డిసెంబరు 16 ప్రఖ్యాత దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు రాజమండ్రిలో తాసీల్దారు సత్తెన్న పంతులు ఇంట జన్మించారు.
డిసెంబరు 23 రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చే సందర్భంగా జరిగిన సంబరాలలో వైస్రాయి లార్డ్ హర్డింగ్ పై జరిగిన హత్యాప్రయత్నం ఢిల్లీ-లాహోర్ కుట్రగా చరిత్రకెక్కింది.
భారత్
డిసెంబరు 23 ఢిల్లీ-లాహోర్ కుట్రలో భాగంగా వైస్రాయ్ హార్డింజ్పై రాష్ బిహారీ బోస్ బృందం బాంబు దాడి జరిపింది; వైస్రాయ్ గాయాలతో బయటపడ్డాడు.
భారత్
జననాలు
జనవరి 8 చెలమచెర్ల రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, అధ్యాపకులు, రచయిత. (మ.1972).
భారత్
జనవరి 14 టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (మ.2007).
జనవరి 29 అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (మ. 2009).
భారత్
మార్చి 26 పండితారాధ్యుల నాగేశ్వరరావు, పత్రికారచయిత, ఆంధ్రప్రభ బెంగళూరు రెసిడెంట్ ఎడిటర్గా, ఈ పత్రికలతో పాటుగా గోభూమి, క్రాంతి, సంజయ, ప్రజాప్రభ వారపత్రిక, Pedestrian పత్రికలలో సంపాదకునిగా పనిచేశాడు.
ఏప్రిల్ 19 గ్లెన్న్ సీబోర్గ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1999).
జూన్ 9 ఉమ్మెత్తల గోపాలరావు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
జూలై 1 కె.వి.రెడ్డి, ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత, రచయిత. (మ.1972).
జూలై 31 మిల్టన్ ఫ్రీడ్మన్, అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత (మ.2006).
ఆగస్టు 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి, జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992).
ఆగస్టు 6 కొత్త రఘురామయ్య, రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. (మ.1979).
భారత్
ఆగస్టు 16 వానమామలై వరదాచార్యులు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన పండితుడు, రచయిత (మ.1984).
ఆగస్టు 21 బ్రహ్మ ప్రకాష్, మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (మ.1984).
ఆగస్టు 30 వెల్లాల ఉమామహేశ్వరరావు, తెలుగు సినిమా తొలితరం కథానాయకుడు.
సెప్టెంబరు 10 బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి (మ.2002).
భారత్
సెప్టెంబరు 26 కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు (మ.1995).
నవంబరు 7 చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (మ.1991).
డిసెంబరు 2 బి.నాగిరెడ్డి, తెలుగు సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (మ.2004).
డిసెంబరు 16 ఆదుర్తి సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత (మ.1975).
మరణాలు
నవంబరు 30 ధర్మవరం రామకృష్ణమాచార్యులు, నటుడు, నాటక రచయిత. (జ.1853).