జనవరి 10 శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం విడుదలైంది.
జనవరి 14 'సంక్రాంతికి వస్తున్నాం'తో దగ్గుబాటి వెంకటేష్ సీనియర్ హీరోల్లో 300 కోట్ల వసూళ్లు సాధించిన తొలి కథానాయకుడిగా నిలిచారు.
జనవరి 16 ఇస్రో స్పేడెక్స్ ఉపగ్రహాల డాకింగ్ విజయవంతమైనట్లు నిర్ధారణ; స్వదేశీ సాంకేతికతతో ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల్లో భారత్ చేరింది.
భారత్
ఫిబ్రవరి 7 రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
ఫిబ్రవరి 23 ఐసిసి ఛాపింయన్స్ ట్రోఫి (2025)లో భాగంగా దుబాయలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. విరాట్ కొహ్లీ అజేయ సెంచరీ సాధించి భారత విజయానికి దోహదపడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.
భారత్
మార్చి 9 భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ (2025)ని గెలుచుకుంది. మూడు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను గెలుచుకున్న మొదటి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. కెప్టెన్ రోహిత్ శర్మ 76 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు.
భారత్
మార్చి 13 విజయశాంతి తెలంగాణ శాసనమండలి సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మార్చి 19 అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన బారీ విల్మోర్, సునీతా విలియమ్స్ వ్యోమగాములు స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా భూమికి తిరిగి వచ్చారు.
ఏప్రిల్ 7 విజయశాంతి తెలంగాణ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
జూలై 13 తెలుగు తెరపై ప్రతినాయక, క్యారెక్టర్ పాత్రలకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు హైదరాబాదులో మరణించారు.
జూలై 30 నాసా-ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్ను జీఎస్ఎల్వీ ఎఫ్16 ద్వారా విజయవంతంగా ప్రయోగించారు.
భారత్
ఆగస్టు 24 గగన్యాన్ మానవసహిత అంతరిక్ష కార్యక్రమం కోసం ఇస్రో తొలి సమీకృత ఎయిర్ డ్రాప్ పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
భారత్
సెప్టెంబరు 25 పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్స్టర్ చిత్రం 'ఓజీ' విడుదలైంది.
అక్టోబరు 18 పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మధ్య యుద్ధవాతావరణం నేపథ్యంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ముగ్గురు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ మృతి చెందారు.
అక్టోబరు 24 హైదరాబాదు నుంచి బెంగళూరు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు శివారులో ద్విచక్రవాహనాన్ని ఢీకొని ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది, 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.
అక్టోబరు 31 మాజీ క్రికెట్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అక్టోబరు 31 ప్రభాస్ బాహుబలి రెండు భాగాల సమాహారం 'బాహుబలి: ది ఎపిక్' విడుదలై రీ-రిలీజ్ ఓపెనింగ్ రికార్డు నెలకొల్పింది.
నవంబరు 2 ఇస్రో సమాచార ఉపగ్రహం సీఎంఎస్-03ను ఎల్వీఎం3-ఎం5 ద్వారా శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
భారత్
డిసెంబరు 15 హైదరాబాదు రవీంద్రభారతిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని వెంకయ్య నాయుడు తదితరులు ఆవిష్కరించారు.
డిసెంబరు 24 ఇస్రో ఎల్వీఎం3-ఎం6 ద్వారా 6,100 కిలోల బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది; భారత గడ్డ నుంచి ఎగిరిన అత్యంత బరువైన విదేశీ ఉపగ్రహం ఇదే.
భారత్
మరణాలు
జనవరి 12 మంద జగన్నాథం, రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు. (జ. 1951).
భారత్