ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 16 గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది. భారత్
  • మార్చి 17 భారత లోక్‌సభ స్పీకర్‌గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు. భారత్
  • మార్చి 17 నీలం సంజీవరెడ్డి నాల్గవ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. భారత్
  • ఏప్రిల్ 21 ఘంటసాల తన పూర్వీకుల గ్రామమైన కృష్ణా జిల్లా ఘంటసాలలో గాన కచేరీ చేయగా గ్రామస్థులు ఆయనను ఏనుగు అంబారీపై ఊరేగించారు.
  • ఏప్రిల్ 24 వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
  • మే 1 ఉత్తర ప్రదేశ్ గవర్నర్‌గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.
  • మే 10 అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
  • మే 11 అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు).
  • మే 13 భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు. భారత్
  • జూన్ 7 ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
  • జూన్ 14 ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించింది.
  • జూలై 23 జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.
  • ఆగస్టు 2 రెండవ బ్లాక్‌వాల్ టన్నెల్ (సొరంగం) లండన్ లోని గ్రీన్‌విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇది థేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం.
  • ఆగస్టు 30 అమెరికా సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్‌గుడ్ మార్షల్ ని నియమించారు.
  • సెప్టెంబరు 4 భారతదేశంలోని కొయ్‌నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు. భారత్
  • సెప్టెంబరు 14 హైదరాబాదు రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి, బహుభాషావేత్త బూర్గుల రామకృష్ణారావు గుండెపోటుతో కన్నుమూశారు.
  • నవంబరు 5 ఏటీఎస్‌-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది.
  • డిసెంబరు 11 పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది. భారత్

జననాలు

  • జనవరి 2 అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016).
  • జనవరి 5 కల్పన, దక్షిణ భారత చలన చిత్ర నటి. భారత్
  • జనవరి 7 ఇర్ఫాన్ ఖాన్, హిందీ సినిమానటుడు, నిర్మాత. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.2020). భారత్
  • జనవరి 15 భానుప్రియ, తెలుగు, తమిళ సినీనటి.
  • ఫిబ్రవరి 11 మాలినీ అవస్థి భారతీయ జానపద గాయని. పద్మశ్రీ పురస్కార గ్రహీత. భారత్
  • ఫిబ్రవరి 23 శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త.
  • మార్చి 3 శంకర్ మహదేవన్, భారతీయ గాయకుడు, స్వరకర్త. భారత్
  • మార్చి 10 కాండ్రు కమల, మెంబర్ అఫ్ శాసనసభ మంగళగిరి అండ్ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్.
  • మార్చి 30 నగేశ్ కుకునూర్, సినిమా దర్శకుడు.
  • మే 15 మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి. భారత్
  • మే 16 సామవేదం షణ్ముఖ శర్మ, ఆధ్యాత్మిక వేత్త, కవి, సినీ గేయరచయిత.
  • మే 20 వనమాలి: తెలుగు సినీ గీతరచయిత.
  • జూన్ 24 ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.
  • జూన్ 27 గంగాధర శాస్త్రి, గాయకుడు, సంగీత దర్శకుడు.
  • జూలై 13 సీత , తెలుగు తమిళ ,కన్నడ ,మలయాళ చలన చిత్ర నటీ.
  • ఆగస్టు 28 ఫాదర్ రవి శేఖర్, కళాదర్శిని డైరెక్టరు అయిన ఫా. జో సేబాస్టియన్, ఎస్.జె. గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు.
  • సెప్టెంబరు 12 అమల అక్కినేని , తెలుగు చలనచిత్ర నటి.
  • సెప్టెంబరు 15 రమ్యకృష్ణ, నటి.
  • సెప్టెంబరు 30 దీప్తి భట్నాగర్, భారతీయ సినీ నటీ, మోడల్, టీ వి.వ్యాఖ్యత. భారత్
  • అక్టోబరు 21 అశ్వనీ నాచప్ప , మాజీ భారతీయ క్రీడా కారిణి, నటి. భారత్
  • నవంబరు 13 జుహీ చావ్లా, భారత సినీనటి. భారత్
  • నవంబరు 22 బోరిస్ బెకర్, జర్మనీకి చెందిన మాజీ ప్రపంచ నం. 1 టెన్నిస్ క్రీడాకారుడు.
  • నవంబరు 23 గారీ క్రిస్టెన్, దక్షిణ ఆఫ్రికా యొక్క మాజీ క్రికెట్ ఆటగాడు.
  • డిసెంబరు 11 మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత.

మరణాలు

  • ఫిబ్రవరి 24 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాము. (జ.1886).
  • జూన్ 7 డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893).
  • జూన్ 30 వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899).
  • ఆగస్టు 2 అసోసియేటెడ్ నీగ్రో ప్రెస్ స్థాపించిన క్లాడ్ ఎ బార్నెట్, తన 78వ ఏట మరణించాడు.
  • సెప్టెంబరు 14 బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899).
  • సెప్టెంబరు 20 బుచ్చిబాబు , అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు, నవలలు, నాటికలు , వ్యాసాలు,రచయిత ,కవి,(జ.1916).
  • అక్టోబరు 6 సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898).
  • అక్టోబరు 9 చే గెవారా (చే గువేరా) దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (జ.1928).
  • అక్టోబరు 12 రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు. భారత్
  • నవంబరు 14 సి.కె.నాయుడు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895). భారత్
  • డిసెంబరు 11 మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889). భారత్
  • డిసెంబరు 19 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893).

సినిమా

  • ఫిబ్రవరి 2 'నిర్దోషి (1967 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • ఫిబ్రవరి 10 'ముగ్గురు మిత్రులు (1967 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • మార్చి 22 'కంచుకోట' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 7 'గృహలక్ష్మి (1967 సినిమా)' చిత్రం విడుదలైంది.
  • ఏప్రిల్ 7 'భువనసుందరి కథ' చిత్రం విడుదలైంది.
  • జూన్ 29 'భామావిజయం' చిత్రం విడుదలైంది.
  • జూలై 28 'శివభక్త విజయము' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 5 'సతీ సుమతి' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 10 'నిండు మనసులు' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 12 'వసంత సేన (సినిమా)' చిత్రం విడుదలైంది.
  • ఆగస్టు 31 'స్త్రీ జన్మ' చిత్రం విడుదలైంది.
  • నవంబరు 3 'పుణ్యవతి' చిత్రం విడుదలైంది.
  • డిసెంబరు 14 'అవేకళ్లు' చిత్రం విడుదలైంది.

ఈ సంవత్సరపు ప్రస్థానాలు