జనవరి 16 గోవా, డామన్, డయ్యూలు యూనియన్ టెరిటరీగా ఉంటుందా, మహారాష్ట్రలో కలిసిపోతుందా అని తెలుసుకోవటానికి ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరిగింది. యూనియన్ టెరిటరీ గానే, కొనసాగుతామని, ఈ ప్రాంతాల ప్రజలు వెల్లడించారు. 30 మే 1987 న గోవాకి పూర్తి రాష్ట్ర ప్రతిపత్తి లభించింది.
భారత్
మార్చి 17 భారత లోక్సభ స్పీకర్గా నీలం సంజీవరెడ్డి పదవిని స్వీకరించాడు.
భారత్
మార్చి 17 నీలం సంజీవరెడ్డి నాల్గవ లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు.
భారత్
ఏప్రిల్ 21 ఘంటసాల తన పూర్వీకుల గ్రామమైన కృష్ణా జిల్లా ఘంటసాలలో గాన కచేరీ చేయగా గ్రామస్థులు ఆయనను ఏనుగు అంబారీపై ఊరేగించారు.
ఏప్రిల్ 24 వ్లాదిమిర్ కొమరోవ్ అనే అంతరిక్ష శాస్త్రవేత్త పారాచూట్ తెరుచుకోకపోవటం వల్ల సూయజ్-1 లో మరణించాడు. ఇతడు అంతరిక్ష నౌకలో మరణించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు.
మే 1 ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.
మే 10 అమెరికా అణుబాంబును నెవడా అనే చోట పేల్చి పరీక్షించింది.
మే 11 అమెరికాలో, 10వ కోటి టెలిఫోన్ ను కనెక్ట్ చేసారు (10 కోట్లు టెలిఫోన్లు).
మే 13 భారత రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్ పదవిని స్వీకరించాడు.
భారత్
జూన్ 7 ఆరు రోజుల యుద్ధంలో జెరూసలేం నగరంలోనికి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులు.
జూన్ 14 ప్రజా గణతంత్ర దేశము, చైనా మొట్టమొదటి హైడ్రోజను బాంబును పరీక్షించింది.
జూలై 23 జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.
ఆగస్టు 2 రెండవ బ్లాక్వాల్ టన్నెల్ (సొరంగం) లండన్ లోని గ్రీన్విచ్ దగ్గర ప్రారంభమైంది. ఇది థేమ్స్ నది అడుగు భాగంలో తవ్విన సొరంగం.
ఆగస్టు 30 అమెరికా సుప్రీం కోర్టుకు మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ న్యాయాధిపతిగా థర్గుడ్ మార్షల్ ని నియమించారు.
సెప్టెంబరు 4 భారతదేశంలోని కొయ్నా డాం దగ్గర జరిగిన భూకంపం (6.5 రెక్టర్ స్కేలు) వలన 200 మంది చనిపోయారు.
భారత్
సెప్టెంబరు 14 హైదరాబాదు రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి, బహుభాషావేత్త బూర్గుల రామకృష్ణారావు గుండెపోటుతో కన్నుమూశారు.
నవంబరు 5 ఏటీఎస్-3 కృత్రిమ ఉపగ్రహాన్ని అమెరికా ప్రయోగించింది. రోదసి నుంచి పూర్తిస్థాయిలో భూమి ఛాయాచిత్రాలను తీసిన మొదటి ఉపగ్రహం అది.
డిసెంబరు 11 పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది.
భారత్
జననాలు
జనవరి 2 అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్, కవి. (మ.2016).
జూన్ 24 ఎం.చంద్రశేఖర్, 2009 ఎన్నికలలో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి మల్లు రవిపై విజయం సాధించి మూడవసారి శాసనసభలో ప్రవేశించాడు.
ఫిబ్రవరి 24 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, హైదరాబాదు చివరి నిజాము. (జ.1886).
జూన్ 7 డొరొతీ పార్కర్, అమెరికాకు చెందిన కవయిత్రి, రచయిత్రి. (జ. 1893).
జూన్ 30 వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899).
ఆగస్టు 2 అసోసియేటెడ్ నీగ్రో ప్రెస్ స్థాపించిన క్లాడ్ ఎ బార్నెట్, తన 78వ ఏట మరణించాడు.
సెప్టెంబరు 14 బూర్గుల రామకృష్ణారావు, హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి. (జ.1899).
సెప్టెంబరు 20 బుచ్చిబాబు , అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు, నవలలు, నాటికలు , వ్యాసాలు,రచయిత ,కవి,(జ.1916).
అక్టోబరు 6 సి.పుల్లయ్య, మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు. (జ.1898).
అక్టోబరు 9 చే గెవారా (చే గువేరా) దక్షిణ అమెరికా ఖండపు విప్లవకారుడు, రాజకీయ నాయకుడు. (జ.1928).
అక్టోబరు 12 రామమనోహర్ లోహియా, సోషలిస్టు నాయకుడు, సిద్ధాంతకర్త. భారతదేశంలోని ఇప్పటి సోషలిస్టులకు ఆదిగురువు ఆయన. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా రేడియో స్టేషను పెట్టాడు.
భారత్
నవంబరు 14 సి.కె.నాయుడు, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. (జ.1895).
భారత్
డిసెంబరు 11 మెహర్ చంద్ మహాజన్, భారతదేశ మూడవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1889).
భారత్
డిసెంబరు 19 కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్, హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (జ.1893).
సినిమా
ఫిబ్రవరి 2 'నిర్దోషి (1967 సినిమా)' చిత్రం విడుదలైంది.
ఫిబ్రవరి 10 'ముగ్గురు మిత్రులు (1967 సినిమా)' చిత్రం విడుదలైంది.