ఆనాడు

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • 1796 భారతదేశం నుండి పంపిన ఏనుగు అమెరికా చేరినది. అంతవరకు అమెరికా వాళ్ళు ఏనుగును చూచి ఎరుగరు. భారత్
  • 1919 పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు. భారత్
  • 1919 అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో నిరాయుధ ప్రజలపై జనరల్ డయ్యర్ ఆదేశించిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. భారత్ పూర్తి ప్రస్థానం →

జననాలు

  • 1743 థామస్ జెఫర్‌సన్, అమెరికా సంయుక్త రాష్ట్రాల మూడవ అధ్యక్షుడు. (మ.1826).
  • 1905 న్యాయపతి రాఘవరావు, రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (మ.1984).
  • 1908 బుర్రా కమలాదేవి, ప్రాచీనాంధ్ర, ఆంగ్ల సాహిత్యాలతో పరిచయం ఉంది. ఆమె రచించిన ఛందోహంసి పోస్ట్ గ్రాడ్యేట్ స్టడీస్, ఉభయ బాషాప్రవీణ వారికి పాఠ్యగ్రంథంగా ఎన్నుకోబడింది.
  • 1914 విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998).
  • 1939 సీమస్ హీనీ, ఐరిష్ కవి, నాటక రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.2013).

మరణాలు

  • 1999 షేక్ చిన మౌలానా, నాదస్వర విద్వాంసులు. (జ.1924).
  • 1999 దుద్దిల్ల శ్రీపాద రావు, శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు. (జ.1935).
  • 2005 పొందూరి వెంకట రమణారావు, మైక్రో బయాలజిస్టు. (జ.1917).
  • 2007 ధూళిపాళ సీతారామశాస్త్రి, రంగస్థల, సినిమా నటుడు. (జ.1921).
  • 2007 వాసిరెడ్డి సీతాదేవి, రచయిత్రి. (జ.1933).

సినిమా

  • 2002 'ఫ్రెండ్స్ (2002 సినిమా)' చిత్రం విడుదలైంది.

పండుగలు, జాతీయ దినాలు

  • జలియన్ వాలా బాగ్ సంస్మరణ దినోత్సవం.