మే 28 మహానటుడు ఎన్టీ రామారావు గౌరవార్థం తపాలా బిళ్ళ విడుదలైంది.
భారత్
జూన్ 3 మహమ్మద్ అజారుద్దీన్ ఆసియా కప్లో పాకిస్తాన్పై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
భారత్
జూలై 2 ఫ్రాన్సు 2-1 తేడాతో ఇటలీని ఓడించి యూరోకప్-2000 సాధించింది.
జూలై 19 ఐ.ఎన్.ఎస్. సింధుశస్త్ర (జలాంతర్గామి పేరు) భారతీయ నౌకాదళంలో చేరిన రోజు.
భారత్
ఆగస్టు 10 ప్రపంచ జనాభా పెరుగుదలను, ప్రతిక్షణం, గమనించే, ఇబిబ్లియో అనే వెబ్సైటు, ప్రపంచ జనాభా 6 బిలియన్లకు (600 కోట్లు) చేరుకుందని ప్రకటించింది. ప్రపంచ జనాభా గడియారం. ప్రపంచ జనాభా ఎంతో తెలుసుకోవాలి అంటే ఇక్కడ నొక్కండి.
ఆగస్టు 24 హైదరాబాదులో 24 గంటల వ్యవధిలో 241.5 మి.మీ. వర్షం కురిసి నగర చరిత్రలో అత్యధిక వర్షపాత రికార్డుగా నిలిచింది.
ఆగస్టు 28 హైదరాబాద్ బషీర్ బాగ్ లో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా వామపక్ష పార్టీలు చలో అసెంబ్లీకి పిలుపునిస్తూ వేయిలాది మందితో నిరసన చేయగా ఆ ఆందోళనలో పోలీసులు కాల్పులు జరుపగా రామకృష్ణ, బాలస్వామి, విష్ణువర్ధన్ రెడ్డి లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
సెప్టెంబరు 15 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి.
సెప్టెంబరు 29 జేఎంఎం కేసులో ప్రత్యేక కోర్టు పి.వి.నరసింహారావును దోషిగా ప్రకటించింది; తరువాత హైకోర్టు నిర్దోషిగా తేల్చింది.
భారత్
సెప్టెంబరు 30 నటుడు కృష్ణంరాజు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
అక్టోబరు 1 జనరల్ ఎస్.ఆర్. పద్మనాభన్ భారత దేశము నకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
భారత్
అక్టోబరు 3 వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటనపై భారత్, రష్యా సంతకాలు చేశాయి.
భారత్
అక్టోబరు 12 జే ఎం ఎం ముడుపుల కేసులో పూర్వపు ప్రధానమంత్రి పి వి నరసింహారావు కు, బూటాసింగుకు కోర్టు మూడు సంవత్సరాల కఠిన కారాగారం, 2 లక్షల జరిమానా విధించింది. (తరువాత వీరిద్దరూ నిర్దోషులుగా బయటపడ్డారు).
భారత్
అక్టోబరు 31 డిసెంబర్ 22 న ఢిల్లీ లోని ఎర్రకోటలోకి ప్రవేశించిన ఐదుగురు ఉగ్రవాదులు ఇద్దరు సైనికులను, ఒక సాధారణ పౌరుని హతమార్చారు.
భారత్
డిసెంబరు 19 మ్యాథరి అపరంజిని, కోహిర్ గ్రామము & మండలం, సంగారెడ్డి జిల్లా.
మరణాలు
జనవరి 3 అల్లం శేషగిరిరావు, తెలుగు కథారచయిత. (జ.1934).
ఫిబ్రవరి 5 టీ, జీ.లింగప్ప ,సంగీత దర్శకుడు (జ.1927).
ఏప్రిల్ 8 వేములపల్లి శ్రీకృష్ణ, కమ్యూనిష్ఠు నేత, శాసనసభ్యులు, కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు.
ఏప్రిల్ 21 నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (జ.1932).
భారత్
ఏప్రిల్ 24 రామినేని అయ్యన్న చౌదరి, సంఘసేవకుడు, దాత, కళాపోషకుడు, విద్యావేత్త.
జూలై 24 ద్వారం భావనారాయణ రావు, వయొలిన్ విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు కుమారుడు (జ.1924).
ఆగస్టు 11 పైడి జైరాజ్, భారత సినీరంగంలో నటుడు, నిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత (జ.1909).
భారత్
అక్టోబరు 9 కోగిర జయసీతారాం, చిత్రకారుడు, రచయిత, తబలా, హార్మోనియం విద్యాంసుడు. (జ.1924).
అక్టోబరు 25 గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (జ. 1926).
నవంబరు 4 నాగేంద్ర,(రాజన్ నాగేంద్ర సంగీత ద్వయం) సంగీత దర్శకులు (జ.1935).
నవంబరు 7 సి.సుబ్రమణ్యం, భారతీయుడు, భారతరత్న గ్రహీత. (జ.1910).
భారత్
డిసెంబరు 18 మాధవపెద్ది సత్యం, తెలుగు సినిమా నేపథ్య గాయకుడు, రంగస్థల నటుడు. (జ.1922).
సినిమా
ఫిబ్రవరి 4 'క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్రం విడుదలైంది.
జూలై 30 'అంతా మన మంచికే (2000 సినిమా )' చిత్రం విడుదలైంది.
సెప్టెంబరు 15 'రాయలసీమ రామన్న చౌదరి' చిత్రం విడుదలైంది.
అక్టోబరు 20 'అమ్మో ఒకటో తారీఖు' చిత్రం విడుదలైంది.