ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 13 మర్రి చెన్నారెడ్డి నేటి వికారాబాదు జిల్లా మార్పల్లి మండలం సిరిపురం గ్రామంలో జన్మించారు.
  • ఫిబ్రవరి 28 రాజమహేంద్రవరంలో కందుకూరి అధ్యక్షతన, గిడుగు రామమూర్తి కార్యదర్శిగా వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం స్థాపితమైంది.
  • మార్చి 31 హైదరాబాదులో హైకోర్టు భవన నిర్మాణం పూర్తయింది.
  • ఏప్రిల్ 11 అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పడింది.
  • ఏప్రిల్ 13 పంజాబ్ లోని జలియన్ వాలా బాగ్లో సమావేశమైన భారతీయ ఉద్యమ కారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. ఈ సంఘటలనలో సుమారు379 మంది మరణించారు. 1200 మంది గాయపడ్డారు. భారత్
  • ఏప్రిల్ 13 అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్‌లో నిరాయుధ ప్రజలపై జనరల్ డయ్యర్ ఆదేశించిన కాల్పుల్లో వందలాది మంది మరణించారు. భారత్
  • ఏప్రిల్ 16 అమృతసర్ ఉదంతంలో మరణించిన ఉద్యమకారులకు నివాళులర్పిస్తూ మహాత్మా గాంధీ ఒకరోజు "ప్రార్థన , ఉపవాసం" నిర్వహించాడు. భారత్
  • మే 27 ఆధునికాంధ్ర సమాజ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులు కన్నుమూశారు.
  • ఆగస్టు 16 ఆంధ్రప్రదేశ్ 7వ ముఖ్యమంత్రి టి.అంజయ్య హైదరాబాదులో జన్మించారు.
  • అక్టోబరు 24 న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీ పతనమై మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది.
  • నవంబరు 27 మొదటి ప్రపంచ యుద్ధం: మిత్రరాజ్యాలు బల్గేరియాతో న్యూలీ సంధి చేసుకున్నాయి.

జననాలు

  • జనవరి 13 మర్రి చెన్నారెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (మ.1996).
  • ఫిబ్రవరి 9 ముదిగొండ సిద్ద రాజలింగం, స్వాతంత్ర్య సమరయోధుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. భారత్
  • ఫిబ్రవరి 19 తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, రచయిత, సినిమా నిర్మాత. (మ.2006).
  • మార్చి 6 గడియారం రామకృష్ణ శర్మ, సాహితీవేత్త.
  • మే 1 మన్నా డే, నేపథ్య గాయకుడు.
  • మే 2 పాగ పుల్లారెడ్డి, గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాటుపడ్డాడు. (మ.2010).
  • జూన్ 8 వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1971).
  • జూలై 1 టి.ఎన్.విశ్వనాథరెడ్డి, భారత పార్లమెంటు సభ్యుడు. భారత్
  • జూలై 18 జయచామరాజేంద్ర వడియార్, మైసూరు సంస్థానానికి 25వ, చివరి మహారాజు. (మ.1974).
  • జూలై 20 ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్టు పర్వతాన్ని ఎక్కాడు. (మ.2008).
  • ఆగస్టు 12 విక్రం సారాభాయ్, భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు. (మ.1971). భారత్
  • ఆగస్టు 16 టంగుటూరి అంజయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 8వ ముఖ్యమంత్రి (మ.1986).
  • సెప్టెంబరు 22 నందగిరి ఇందిరాదేవి, స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలితరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (మ.2007).
  • అక్టోబరు 1 మజ్రూహ్ సుల్తాన్‌పురి, భారతీయ కవి, పాటల రచయిత (మ. 2000). భారత్
  • నవంబరు 1 అంట్యాకుల పైడిరాజు, చిత్రకారుడు, శిల్పి. (మ.1986).
  • నవంబరు 27 కంచర్ల సుగుణమణి సంఘసేవకురాలు, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ అనుయాయి. (మ.2017).
  • డిసెంబరు 4 ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (మ.2012). భారత్
  • డిసెంబరు 16 చింతలపాటి సీతా రామచంద్ర వరప్రసాద మూర్తిరాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. 1800 ఎకరాలు దానం చేసిన దాత (మ.2012). భారత్

మరణాలు

  • జనవరి 6 థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా 26వ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నాయకుడు. (జ.1858).
  • ఏప్రిల్ 4 సర్ విలియం క్రూక్స్, ఇంగ్లీష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త. (జ. 1832).
  • మే 27 కందుకూరి వీరేశలింగం పంతులు, భారతదేశ సంఘసంస్కర్త. (జ.1848).
  • జూన్ 20 కోలాచలం శ్రీనివాసరావు, నాటక రచయిత, న్యాయవాది. (జ.1854).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు