ఆనాడు Aanaadu

ప్రస్థానం

జీవిత చరిత్రలు

గుడిపాటి వెంకట చలం (Chalam)

1894 – 1979

చలంగా ప్రసిద్ధులైన గుడిపాటి వెంకట చలం ఆధునిక తెలుగు సాహిత్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన రచయిత, వేదాంతి. స్త్రీల జీవితాలు, వారు ఎదుర్కొనే హింసలు, స్వేచ్ఛ వంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకుని మైదానం వంటి సంచలన రచనలు చేశారు. సమాజ బహిష్కరణను ఎదుర్కొని జీవిత చరమాంకంలో అరుణాచలం చేరి రమణ మహర్షి సన్నిధిలో ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు.

  1. 1894 మే 18

    ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన రచయిత గుడిపాటి వెంకట చలం మద్రాసు నగరంలో జన్మించారు.

  2. 1911

    చలం పిఠాపురం మహారాజా కళాశాలలో చేరి బ్రహ్మసమాజ భావాల వైపు ఆకర్షితులయ్యారు.

  3. 1920

    టీచర్ ట్రైనింగ్ కోసం రాజమండ్రి వెళ్లిన చలానికి సంఘ బహిష్కరణ ఎదురై పశువుల పాకలో తలదాచుకోవలసి వచ్చింది.

  4. 1921

    చలం రచించిన శశిరేఖ నవల వెలువడింది.

  5. 1927

    స్త్రీ స్వేచ్ఛను ఇతివృత్తంగా చలం రచించిన సంచలన నవల మైదానం వెలువడింది.

  6. 1950

    రచయిత చలం బెజవాడలోని తన ఇంటిని అమ్మి కుటుంబంతో అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమానికి తరలివెళ్లారు.

  7. 1961

    ప్రళయం వస్తుందని ప్రచారం చేసిన చలం తెలిసినవారికి ఉత్తరాలు రాసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని సూచించారు; అటువంటిదేమీ జరగకపోవడంతో నవ్వులపాలయ్యారు.

  8. 1972

    చలం తన ఆత్మకథను చలం అనే పేరుతోనే వెలువరించారు.

  9. 1979 మే 4

    మైదానం వంటి సంచలన రచనలు చేసిన గుడిపాటి వెంకట చలం అరుణాచలంలో కన్నుమూశారు.

  10. 2005

    చలం కథ దోషగుణం ఆధారంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో గ్రహణం చిత్రం వచ్చి విమర్శకుల ప్రశంసలు పొందింది.