జనవరి 5 ఫోర్డ్ మోటార్ కంపెనీ అధినేత, హెన్రీ ఫోర్డ్, తొలిసారిగా, తన సిబ్బందికి, కనీస వేతనం (మినిమం వేజ్ స్కేలు), రోజుకి 5 డాలర్లుగా ప్రవేశ పెట్టాడు.
మార్చి 28 శివతాండవ కావ్య సృష్టికర్త పుట్టపర్తి నారాయణాచార్యులు అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో జన్మించారు.
ఏప్రిల్ 1 ఆంధ్రపత్రిక, వారపత్రిక నుంచి దినపత్రికగా మారింది మద్రాసులో (చెన్నై) . తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ( 1908 సెప్టెంబరు 9) ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.
మే 18 పనామా కాలువ ద్వారా కార్గో (సరుకు/సామాను) తో ప్రయాణించిన మొట్ట మొదటి స్టీం బోటు (ఆవిరితో నడిచే పడవ) పేరు మారినర్.
జూన్ 28 ఫెర్డినాండ్, ఆస్ట్రియా యువరాజు హత్య చేయబడ్డాడు.
జూన్ 29 ఆస్టరాయిడ్ # 791 (పేరు 'అని') ని జి.న్యూజ్ మిన్ కనుగొన్న రోజు.
జూన్ 30 మహాత్మా గాంధీ ని, దక్షిణ ఆఫ్రికా లో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్టు చేసారు.
భారత్
ఆగస్టు 1 జర్మనీ సోవియట్ యూనియన్ పై యుద్ధం ప్రకటించింది. ఇటలీ దేశం దానికదే తటస్థ దేశంగా చెప్పింది.
ఆగస్టు 2 షెర్లాక్ హోమ్స్ సాహస గాధ "హిజ్ లాస్ట్ బౌ" నవల విడుదలైంది.
ఆగస్టు 3 కొత్త పనామా కాలువ గుండా మొదటి ఓడ ప్రయాణించింది.
ఆగస్టు 4 మొదటి ప్రపంచ యుద్ధం : బెల్జియం దేశం మీద జర్మనీ దురాక్రమణ చేసింది. బదులుగా, బ్రిటన్, జర్మనీ పై యుద్ధం ప్రకటించింది.
ఆగస్టు 5 మొదటి ప్రపంచ యుద్ధంలో, జర్మనీ దేశం, సోవియట్ యూనియన్ దేశం, మీద యుద్ధం ప్రకటించినప్పుడు, అమెరికా తనను తాను, తటస్థ దేశంగా ప్రకటించుకున్నది.
ఆగస్టు 5 అమెరికా లోని ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్లేండ్ నగరంలో మొట్టమొదటి ట్రాఫిక్ లైట్లు ప్రారంభించారు.
ఆగస్టు 15 అంకన్ అనే పేరుగల సరుకుల ఓడ (రవాణా ఓడ), అట్లాంటిక్ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం లోకి, పనామా కాలువ ద్వారా, ప్రయాణించటంతో, పనామా కాలువ ప్రారంభమైంది.
ఆగస్టు 30 తన్నెన్బెర్గ్ యుద్ధము. మొదటి ప్రపంచ యుద్ధము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 1914 ఆగష్టు 23 నుంచి 1914 ఆగష్టు 30 వరకు జరిగిన యుద్ధము.
సెప్టెంబరు 9 ప్రజాకవి కాళోజీ నారాయణరావు కర్ణాటకలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లి గ్రామంలో జన్మించారు; ఆయన జన్మదినమే తెలంగాణ భాషా దినోత్సవం.
డిసెంబరు 24 మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా జర్మనీ-బ్రిటన్ల మధ్య పోరు జరుగుతోంది. డిసెంబర్ 24 రాత్రి జర్మన్ సైనికులు తమ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొవ్వొత్తులతో అలంకరించి పాటలు పాడటం ప్రారంభించారు. ఇంగ్లిష్ సైనికులు కూడా వారితో గొంతు కలిపారు. ఇరుపక్షాల సైనికులూ సిగార్లూ మద్యంసీసాలు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకున్నారు. క్రిస్మస్ ట్రూస్గా పేరొందిన ఇలాంటి సంఘటన ప్రపంచ చరిత్రలో మరెప్పుడూ జరగలేదు.
జననాలు
ఫిబ్రవరి 9 హరి గోవిందరావు వర్తక్, మహారాష్ట్ర కు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. పద్మశ్ర్రీ అవార్డు గ్రహీత. (మ.1998).
భారత్
ఫిబ్రవరి 13 మాదాల నారాయణస్వామి, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. (మ.2013).
మార్చి 15 ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు , సంగీత దర్శకుడు (మ .1979).
మార్చి 24 పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.
మార్చి 25 నార్మన్ బోర్లాగ్, అమెరికా వ్యవసాయ శాస్త్రవేత్త.
మార్చి 28 పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు కవి. (మ.1990).
ఏప్రిల్ 3 మానెక్షా, భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008).
భారత్
ఏప్రిల్ 10 త్రిపురారి భట్ల రామకృష్ణ శాస్త్రి , రంగస్థల, సినిమా నటుడు, తొలితరం గాయకుడు (మ.1998).
ఏప్రిల్ 13 విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998).