జూన్ 25 భారతదేశం మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఆడింది.
భారత్
జూలై 23 '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
ఆగస్టు 22 టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
సెప్టెంబరు 24 భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది.
భారత్
అక్టోబరు 1 ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలయిన రోజు (రైసింగ్డే).
అక్టోబరు 1 భారతీయ భాగస్వామ్య చట్టం, 1932 అమలులోకి వచ్చింది.
భారత్
అక్టోబరు 15 దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ('టాటా సన్స్ లిమిటెడ్') ప్రారంభమైంది.
భారత్
నవంబరు 17 లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
నవంబరు 25 ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది.
జననాలు
జనవరి 2 ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త.
జనవరి 6 బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు.
జనవరి 29 పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
ఫిబ్రవరి 1 విఠల్రావు దేశపాండే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. (మ.2016).
ఫిబ్రవరి 6 భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010).
ఫిబ్రవరి 11 రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత. నిర్మాత ,దర్శకుడు, ( మ.2020).
ఫిబ్రవరి 14 ఘంటా గోపాల్రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018).
ఫిబ్రవరి 25 సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016).
భారత్
సెప్టెంబరు 26 13వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. పుట్టిన చోటు పంజాబ్ లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, పాకిస్తాన్లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు. (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
భారత్
సెప్టెంబరు 27 యష్ చోప్రా జన్మించారు. ఈయన హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ దర్శకుడు ఇంకా చిత్ర నిర్మాత.
భారత్
సెప్టెంబరు 29 మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004).
భారత్
అక్టోబరు 6 గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్.
భారత్