ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మార్చి 19 సిడ్నీ హార్బర్ వంతెన ప్రారంభించబడింది.
  • జూన్ 25 భారతదేశం మొట్టమొదటి ఆధికారిక క్రికెట్ టెస్టును (తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్) లార్డ్స్ మైదానంలో ఆడింది. భారత్
  • జూలై 23 '#1246 ఛక' అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, 'సి. జాక్సన్' కనుగొన్నాడు.
  • ఆగస్టు 22 టెలివిజన్ ప్రసారాలను ప్రసారం చేయు మొదటి ప్రయోగాన్ని బి.బి.సి నిర్వహించింది.
  • సెప్టెంబరు 24 భారత్లో అణగారిన వర్గాల కొరకు ప్రత్యేక నియోజక వర్గాలను ఏర్పాటు చెయ్యాలనే ప్రతిపాదనపై కాంగ్రెసు నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలను తొలగిస్తూ వారి మధ్య పూనా ఒప్పందం కుదిరింది. భారత్
  • అక్టోబరు 1 ఇండియన్ మిలిటరీ అకాడమీ మొదలయిన రోజు (రైసింగ్డే).
  • అక్టోబరు 1 భారతీయ భాగస్వామ్య చట్టం, 1932 అమలులోకి వచ్చింది. భారత్
  • అక్టోబరు 15 దేశంలో తొలి వాణిజ్య విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా ('టాటా సన్స్‌ లిమిటెడ్‌') ప్రారంభమైంది. భారత్
  • నవంబరు 17 లండన్ లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
  • నవంబరు 25 ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఏర్పడింది. ఎన్నో విద్యాసంస్థలను స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలోనే, ప్రసిద్ధి చెందిన హైదరాబాదు పారిశ్రామిక ప్రదర్శన (Hyderabad Industrial Exhibition) జరుగుతుంది.

జననాలు

  • జనవరి 2 ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త.
  • జనవరి 6 బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, సంగీత విద్వాంసులు, రేడియో కళాకారులు.
  • జనవరి 29 పంగులూరి రామన్ సుబ్బారావు, ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు,1987 నుండి 1990 వరకు టెస్ట్, కౌంటీ క్రికెట్ బోర్డ్ కు అధ్యక్షుడు.
  • ఫిబ్రవరి 1 విఠల్‌రావు దేశపాండే, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. (మ.2016).
  • ఫిబ్రవరి 6 భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (మ.2010).
  • ఫిబ్రవరి 11 రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు, రచయిత. నిర్మాత ,దర్శకుడు, ( మ.2020).
  • ఫిబ్రవరి 14 ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (మ.2018).
  • ఫిబ్రవరి 25 సుబ్రతా బోస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు. (మ.2016). భారత్
  • ఫిబ్రవరి 26 హేమలతా లవణం, సామాజిక సేవకురాలు జననం.
  • ఫిబ్రవరి 27 వేగె నాగేశ్వరరావు, కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
  • ఏప్రిల్ 10 ఒమర్ షరీఫ్, హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015).
  • ఏప్రిల్ 15 సుదర్శన్ భట్, మరాఠీ కవి (మ. 2003).
  • ఏప్రిల్ 26 ఎం: రంగారావు , కన్నడ,తెలుగు సంగీత దర్శకుడు (మ 1990).
  • మే 3 బూదరాజు రాధాకృష్ణ, ప్రసిద్ధ భాషావేత్త. (మ.2006).
  • మే 6 మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996).
  • మే 18 దూపాటి సంపత్కుమారాచార్య, సత్తుపల్లి లోని శారదా విద్యానికేతన్ కులపతి, రచయిత, శతావధాని.
  • జూన్ 11 ధారా రామనాథశాస్త్రి, నాట్యావధాని (మ.2016).
  • జూన్ 12 పద్మిని , చలన చిత్ర నటి, నృత్య కళాకారిణి ,(మ.2006).
  • జూన్ 21 నిగార్ సుల్తానా, భారతీయ సినిమా నటి. (మ.2000). భారత్
  • జూన్ 22 అమ్రీష్ పురి, భారత సినిమా నటుడు. (మ.2005). భారత్
  • ఆగస్టు 9 జాలాది రాజారావు, తెలుగు రచయిత. (మ.2011).
  • ఆగస్టు 10 పైల వాసుదేవరావు, శ్రీకాకుళం నక్సలెట్ ఉద్యమ యోధుడు (మ.2010).
  • ఆగస్టు 23 ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
  • ఆగస్టు 31 రావిపల్లి నారాయణరావు, 80 కథలు రాశారు. 'పెళ్ళాడి ప్రేమించు' అనే కథా సంపుటి తెలుగు వారికందించారు.
  • సెప్టెంబరు 2 స్యూ మెంగెర్స్, నటి (మ.2011).
  • సెప్టెంబరు 26 13వ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. పుట్టిన చోటు పంజాబ్ లోని గాహ్ (ఇప్పుడు చక్వాల్ జిల్లా, పాకిస్తాన్లో ఉంది). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు. (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు). భారత్
  • సెప్టెంబరు 27 యష్ చోప్రా జన్మించారు. ఈయన హిందీ చిత్రాలలో పనిచేసిన భారతీయ దర్శకుడు ఇంకా చిత్ర నిర్మాత. భారత్
  • సెప్టెంబరు 29 మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు (మ.2004). భారత్
  • అక్టోబరు 6 గణేశన్ వెంకటరామన్, భారతీయ భౌతికశాస్త్రవేత్త, రచయిత, శ్రీ సత్యనాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్. భారత్
  • అక్టోబరు 8 శివశక్తి దత్త ,తెలుగు ,సినీ గేయరచయిత.
  • అక్టోబరు 12 యుషిరో మియురా, తన 70వ యేట, 75వ యేట, 80వ యేట ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించుకున్న జపాన్‌కు చెందిన పర్వతారోధకుడు.
  • అక్టోబరు 24 జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (మ. 2022).
  • అక్టోబరు 26 కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప. భారత్
  • నవంబరు 4 వి.బి.రాజేంద్రప్రసాద్, జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. (మ.2015).
  • నవంబరు 7 గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (మ.2013).
  • డిసెంబరు 8 చలసాని ప్రసాద్, విరసం వ్యవస్థాపక సభ్యుడు, హేతువాది (మ.2015).
  • డిసెంబరు 21 యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.2014).
  • డిసెంబరు 28 ఇండియా - ధీరుభాయ్ అంబానీ, పారిశ్రామికవేత్త. భారత్
  • డిసెంబరు 28 నేరెళ్ళ వేణుమాధవ్, మిమిక్రీ కళాకారుడు. వీరికి 'ధ్వన్యనుకరణ సామ్రాట్' అనే బిరుదం కూడా కలదు.

మరణాలు

  • ఫిబ్రవరి 9 దొంతులమ్మ, ఆంధ్ర యోగిని, అవధూత.
  • మార్చి 29 కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1885).
  • ఏప్రిల్ 4 విలియం ఆస్ట్వాల్డ్, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1853).
  • మే 20 బిపిన్ చంద్ర పాల్, భారత స్వాతంత్ర్య పోరాటయోధుడు (జ.1858). భారత్
  • సెప్టెంబరు 16 రోనాల్డ్ రాస్, శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1857).