ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • మే 16 మొట్ట మొదటి ఎలక్ట్రిక్ ట్రామ్, బెర్లిన్ (జర్మనీ) సమీపంలో, ప్రజలకు అందుబాటు (ప్రజసేవ) లోకి వచ్చింది.
  • జూలై 2 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
  • డిసెంబరు 11 కందుకూరి వీరేశలింగం తన ఇంట తొలి వితంతు పునర్వివాహం జరిపించి సంఘ సంస్కరణ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించారు.

జననాలు

  • జనవరి 18 నాళం కృష్ణారావు, సంఘ సంస్కర్త, గ్రంథాలయ స్థాపకుడు, పత్రిక సంపాదకులు, స్వాతంత్ర్య సమరయోధుడు, భాషావేత్త. (మ.1961). భారత్
  • ఫిబ్రవరి 1 సిబ్లీ జాన్ "టిప్" స్నూక్, దక్షిణ ఆఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్. ఆల్ రౌండర్. (మ.1966).
  • ఫిబ్రవరి 12 రష్యన్ బాలేరినా పురస్కారం పొందిన 20వ శతాబ్దపు నృత్యకారిణి అన్నా పావ్లోవా జననం. (మ.1931).
  • ఆగస్టు 6 అలెగ్జాండర్ ఫ్లెమింగ్, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త. (మ.1955).
  • అక్టోబరు 15 పి.జి.ఉడ్‌హౌస్, ఆంగ్ల హాస్య రచయిత. (మ.1975).
  • అక్టోబరు 21 రూపనగుడి నారాయణరావు, సాహితీశిల్పి, నాటకకర్త. (మ.1963).
  • డిసెంబరు 23 బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (మ.1953). భారత్

మరణాలు

  • ఫిబ్రవరి 9 దాస్తొయెవ్‌స్కీ, రష్యన్ రచయిత. క్రైమ్‌ అండ్ పనిష్‌మెంట్, బ్రదర్స్ కరమొజొవ్ నవలల రచయిత.. (జ.1821).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు