ఆనాడు Aanaadu

ఈ రోజు చరిత్రలో

సంఘటనలు

  • జనవరి 15 కవిరాజు త్రిపురనేని రామస్వామి కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు.
  • ఆగస్టు 2 బెలాయిట్ నగరానికి (విస్కాన్సిన్ రాష్ట్రం, అమెరికా) చెందిన చెస్టర్ ఎ. హాడ్జ్ కి ముళ్ళ తీగ (ముళ్ళకంచె) పేటెంట్ హక్కులు ఇచ్చారు. ఈ ముళ్ళ కంచెనే మనం ఇప్పుడు, స్థలాలకు, రక్షణకు కంచెగా, హద్దులుగా వాడుతున్నాము.

జననాలు

  • జనవరి 15 త్రిపురనేని రామస్వామి, సంఘసంస్కర్త. (మ.1943).
  • జనవరి 30 జూన్ మాథిస్.
  • మార్చి 1 చెరుకువాడ వేంకట నరసింహం, ఉపన్యాస కేసరి, బీమాడిండిమ, ఆంధ్ర డెమొస్తనీస్. (మ.1964).
  • మార్చి 17 డి.వి.గుండప్ప, కన్నడ కవి, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత (మ.1975).
  • జూలై 22 గుస్టావ్ లుడ్విగ్ హెర్ట్‌జ్, జర్మన్ క్వాంటమ్ శాస్త్రవేత్త (1925 లో నోబెల్ బహుమతి గ్రహీత). ఇతని బంధువైన హీన్‌రిఛ్ రుడాల్ఫ్ హెర్ట్‌జ్ పేరుతో రేడియో తరంగాలకు (హెర్ట్‌జ్) గా పేరు పెట్టారు.
  • సెప్టెంబరు 19 తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (మ.1973).
  • అక్టోబరు 1 పండిట్ హృదయనాథ్ అజుధియనాథ్ కుంజ్రు, రాజకీయవేత్త, సామాజిక కార్యకర్త.
  • డిసెంబరు 22 ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త, శ్రీనివాస రామానుజన్ (మ.1920).
  • డిసెంబరు 30 కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో పేరొందిన జంట సోదర కవులు.

మరణాలు

  • ఫిబ్రవరి 26 ఆనందీబాయి జోషి, పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి మహిళా వైద్యురాలు. (జ.1865).

ఈ సంవత్సరపు ప్రస్థానాలు